(హైదరాబాద్,న్యూస్ఇన్)

దివంగత ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని పునీత్ రాజ్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అవుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ప్రకృతి, ప్రజాసేవలో తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంగా తాను ఈ కార్యక్రమాంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, స్థిరత్వం మాజీ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అశ్విని రాజ్ కుమార్ చేరారు.పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె తమతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకోవాడం అభినందనీయమని సంతోష్ అన్నారు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత అన్నారుగ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా పర్యవరణం కాపాడనికి కట్టుబడి ఉందన్నారు. కర్నాటక లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుందన్న ధీమాను సంతోష్ వ్యక్తం చేశారు.





Leave a Reply