టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)

కేంద్ర ప్రభుత్వం ప్రదాన ప్రతిపక్ష నేత అయిన రాహూల్ గాంధీని గణతంత్ర వేడుకల్లో అవమానపరిచేలా వ్యవహరించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. గతంలో ఉన్న సాంప్రదాయాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ప్రతిపక్ష నేతలకు గౌరవం ఇచ్చినప్పుడే ప్రజా స్వామ్య విలువలు కాపాడినట్లు అవుంతందని చెప్పారు. గాంధీభవనలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సాంప్రదాయాలు, పద్ధతి గురించి మాట్లాడే నేతలు రాహూల్ గాంధీని గణతంత్ర వేడుకులకు ఆహ్వనించి మూడో వరుసలో స్థానం కేటాయించడం ఏం పద్ధతి అని నిలదీశారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సాంప్రదాయలకు తెరతీస్తోందన్నారు. ఇందిరాగాంధీ, వాజ్ పేయ్ హాయంలో ప్రతిపక్ష నేతలకు మొదటి వరుసలోనే సీటింగ్ ఏర్పాట్లు చేసిన విషయాన్ని జగ్గారెడ్డి ప్రస్తావించారు. గణతంత్రదినోత్సవం కావడంతో రాహూల్ గాంధీ కూడా హుందాగా వ్యవహరించారన్నారు. రాహూల్ గాంధీ ఇంట్లోనే ప్రదాని పదవి పుట్టిందని, ఆ పదవిలో ఉన్నా లేకున్నా గాంధీ కుటుంబం హోదాకు ఎక్కడా ఇబ్బంది ఉండదన్నారు. 47 ఏళ్ల పాటు ఆ కుటుంబం దేశాన్ని పాలించిందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సింహా ఎక్కడున్నా….సింహమే అని వెనుక వరుసలో ఉన్నా….. దాని ప్రాధాన్యత దానికి ఉంటుందన్నారు. మంచి పాలన ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం కల్పించారని, గాంధీ కుటుంబానికి అధికారం కట్టబెట్టలేదని జగ్గారెడి అన్నారు. ప్రజల్లో విబేధాలు సృష్టించి లబ్దిపొందేందుకే బీజెపి ప్రయత్నిస్తుందని, ప్రజల బాగోగుల గురించి ఆ పార్టీ ఎప్పుడూ ఆలోచించలేని విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.





Leave a Reply