
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
హైదరాబాద్ నగరానికి వచ్చి పోయే పలు రైళ్లను బుధవారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పౌరసంబంధాల అధికారి శ్రీదర్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వివిధ మార్గాల్లో నడిచే 32 రైళ్లను రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికులు ఈ అంశాన్ని పరిగణలోకి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైల్వే శాఖ పరంగా నిర్వహణా కారాణాల రీత్యా ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.
రద్దు చేసిన రైళ్లలో కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి రోజు వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఉన్నాయి. హైదరాబాద్, కర్నూల్,నిజామాబాద్, ||షిర్టీ వెళ్లే రూట్లలో రద్దు చేసిన రైళ్లు ఎక్కువగా ఉన్నాయి.





Leave a Reply