అన్ని వివరాలు అందించాము కేటిఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి బొగ్గు గనుల్లో జరుగుతున్న కుంభకోణాలపై గవర్నర్ కు అన్ని వివరాలతో ఫిర్యాదు చేసినట్లు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి సింగరేణి కుంభకోణాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియా మాట్లాడిన కేటిఆర్ ప్రభుత్వం టెండర్లలో వ్యవహరిస్తున్న తీరును తప్పు బట్టారు. గతంలో లేని నిబంధనలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే పెట్టడం జరిగిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లను బెదిరిస్తూ, రింగ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని కేటిఆర్ అన్నారు. సింగరేణి కుంభకోణాలను మా పార్టీ డిప్యూటీ లీడర్ హరీష్ రావ్ బయటపెట్టడంతోనే ప్రభుత్వంలో వణుకు మొదలైందని కేటిఆర్ అన్నారు.

కేవలం ఆరోపణలే కాకుండా ఆధారాలు కూడా గవర్నర్ కు అందిచేసామన్నారు. కుంభకోణాల విషయాన్ని డైవర్ట్ చేసేందుకు ట్యాపింగ్ కేసును సర్కార్ తెరపైకి తెస్తుందన్నారు. నేడు తెలంగాణాలో సిఎం (CM) అంటే అంటే కోల్ మాఫియా (Coal Mafia) కి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతున్నాడు విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకునేందుకు వెళ్లినట్లు ఫోజులు కొడుతున్నాడన్నారు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తదో సీఎం ఆలోచించుకోవాలన్నారు.

పది కోట్ల రూపాయలు సింగరేణి నిధులు దుర్వినియోగం చేసి ఫుట్ బాల్ ఆటకి వినియోగించడం జరిగిందన్నారు. కుంభకోణాలకు సంబంధించి ఇన్ని ఆధారాలు బయటపెడితే కూడా, ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటివరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదు. మా ప్రభుత్వ హాయంలో అన్ని టెండర్లను పారదర్శకంగా నిర్వహించినట్లు కేటిఆర్ చెప్పారు. సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయట పెట్టినా పట్టించుకోవడం లేదన్నారు. రెండున్నర మూడు కోట్లలో అయ్యే పని దేశం మొత్తంలో, ఒక్క తెలంగాణలో మాత్రం ఏడు కోట్లు ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. అట్లాగే ఎక్స్ప్లోజివ్స్ , జిలెటిన్ స్టిక్స్, 30 శాతం అదనంగా రేటు పెంచలేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.




Leave a Reply