NewsInn

News in a Click

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు విద్యార్థులు మృతి

(హైదరాబాద్,న్యూస్ఇన్)

Hyderabad Students Car Accident

హైదరాబాద్ – మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది. 8 మంది తో కలిసి వెళుతున్న కారు అతి వేగంగా మెట్రో పిల్లర్ 97ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో అక్కడికక్కడే మృతిచెందిన ఇద్దరు విద్యార్థులు సాయి వరుణ్, నిఖిల్ లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు
వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం నుంచి సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ అనే ముగ్గురు విద్యార్ధులు సురక్షితంగా బయటపడ్డారు. వీరిని వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *