మహాఘట్టానికి మేడారం ముస్తాబు
తెలంగాణాలో మొదలైన మేళా
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా ప్రాంతంతో పాటు దేశంలోని గిరిజన గూడాలు మేడారం వైపు కదిలి వెళుతున్నాయి. మహాజాతర పెద్ద ఎత్తున గిరిజనలతో పాటు అన్ని వర్గాల ప్రజలు తరలి వస్తున్నారు. రెండేళ్లకు ఒక్క సారి జరిగే ఈ జాతరకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున వస్తుంటారు. లక్షలాదిగా తరలివచ్చే ఈ జాతరకు ప్రభుత్వం దాదాపు ఆరు నెలల క్రితం నుంచే ఏర్పాట్లు మొదలు పెడుతోంది. ఈ ఏడాది కొత్తగా…..మేడారం ప్రధాన ఆలయ గద్దెలను అతి సుందరగా ప్రభుత్వం ముస్తాబు చేసింది. శాశ్విత నిర్మాణాన్ని పూర్తి చేసి గిరిజనలను ఆకట్టుకుంది. ప్రధాన అలయ ప్రాంగణం అంతా ఎంతో ఆకర్షణీయంగా తీర్చి దిద్ది ఈ చరిత్రను తెలియచేసేలా శాశ్వితంగా ఏర్పాట్లు చేసింది. వనదవేతలను సందర్శించే వారికి చరిత్ర తెలియ చేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేసింది. మహాజాతర కోసం దాదాపు 300 కోట్లతో ఆ ప్రాంతంలో అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ఉత్తర తెలంగాణా జిల్లాల్లోని ప్రభుత్వ అధిఆకరులు ఈ జాతర ఏర్పాట్లపైనే దాదాపు రెండు నెలలుగా సమీక్షలు నిర్వహిస్తూ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఏర్పాట్లు చేయడంపై దృష్టి సారించారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ శాఖా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంది.



ఏర్పాట్లపైనే ప్రత్యేక దృష్టి….
భారీగా తరలి వచ్చే భక్తుల సౌకర్యం కోసం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. పోలీసు, ఆర్టీసి, పంచాయతీ రాజ్, ఆరోగ్య, శాఖలు కీలకంగా వ్యవహరించనున్నాయి.రద్దీ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాంటి వంటి ఘటనలు జరుగకుండా పోలీసు అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భక్తులు క్యూలైన్ల ద్వారా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా క్యూలైన్లను బారీ కేడ్లతో ఏర్పాట్లు చేశారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో తాగునీటి వసతికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.ఆర్టీసి హైదరాబాద్ నుంచే దాదాపు 400 బస్సులను నిర్వహిస్తోంది. దక్షిన మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను కూడా ఈ సాతర సందర్భంగా జనసాధరణ్ రైళ్ల పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇవే కాకుండా పొరుగు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి నుంచి మేడారంకు భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తుంటారు. రవాణా సౌకర్యంతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేటు వాహనాల్లో కూడా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండడంతో జోన్ల వారిగా పార్కింగ్ ఏర్పాట్లు చేసి గద్దెల వరకు చేరకునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

వనవాసం నుంచి జనావసం లోకి….
వన దేవతలుగా కొలిచే పగిడిద్ద రాజు పొనుగండ్ల నుంచి బయలుదేరుతారు. గొవింద రాజు కొండాయి నుంచి మేడారం చేరుకుని స్థానిక సారలమ్మ ఆలయంలో అలాయ్–బలాయ్ స్వీకరిస్తారు. సాయంత్రం 5 గంటలకు కన్నెపల్లె నుంచి సారలమ్మ మేడారానికి బయలుదేరారు. సాయంత్రం లక్షలాది మంది భక్తుల హర్షధ్వానాల మధ్య సారలమ్మ, పగిడిద్ద రాజు, గొవింద రాజులు గద్దెల మీదకు చేరుకునే ఘట్టం మహా ఘట్టంగా భావిస్తారు. దీనికోసమే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ముందుస్తుగా చేస్తోంది. గద్దెల మీదకు చేరుకున్న తరువాత భక్తులకు వన దేవతలకు దర్శనం ఇవ్వడం అనవాయితీ…. ఈ దృష్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది గిరిజనులు ఎంతో అతృతగా ఎదురు చూస్తారు. రెండేళ్ల వానవాసం పూర్తి చేసుకుని తల్లులు జనవాసంలోకి ప్రవేశించే ఈ క్షణం భక్తులందరికీ అపూర్వమైన అనుభూతి గా భావిస్తారు.




Leave a Reply