NewsInn

News in a Click

జన సంద్రంగా మారిన జంపన్న వాగు

జన సంద్రంగా మారిన జంపన్న వాగు

వాగు లో భక్తుల పుణ్య స్నానాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగు లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జరిగే మహా జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించడం అనవాయితీ గా వస్తుంది.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు జంపన్న వాగులో ఇసుకతో వన దేవతల ప్రతిమలు ఏర్పాటు చేసి కొబ్బరి కాయ పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శివ సత్తుల పునకాలతో జంపన్న వాగులో “పదివేల దండలే తల్లి అబ్బిస్సా అంటూ సమ్మక్క తల్లికి పబ్బతి పడుతూ పుణ్య స్నానాల ఆచరించి వన దేవతలకు ఓడి బియ్యం బంగారం సమర్పించి తమ మొక్కలను చెల్లించి తమ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇంటి ఇలవేల్పుగా ఆరాధిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *