ఫార్వర్డ్ బ్లాక్ తో అవగాహన
(హైదరాబాద్,న్యూస్ఇన్)


మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణా జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మధ్య అవగాహన కుదిరింది. ఆశావహులు పోటీ చేసే వార్డులపై ఫార్వర్డ్ బ్లాక్ బీఫాంలపై తెలంగాణా జాగృతి అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చలు జరిగినా…రాబోయే ఎన్నికల్లో కూడా మిత్ర పక్షంగానే కొనసాగాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నారు. వారం పది రోజులుగా ఇరు పార్టీల మధ్య జరుగుతున్న చర్చలు నేడు కొలిక్కి వచ్చాయి. జాగృతి అధ్యక్షులు ఫార్వర్డ్ బ్లాక్ కార్యాలయానికి వెళ్లి ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జాగృతి ఆశావహులు ఫార్వర్డ్ బ్లాక్ తరపున రంగంలోకి దిగనున్నారు. అన్ని మున్సిపాల్టీలో కాకున్నా..నిజామాబాద్ తో పాటు పలు మున్సిపాల్టీలో జాగృతి అభ్యర్థులను రంగంలోకి దించాలని కవిత భావిస్తోంది. ఎన్నిక మున్సిపాల్టీలు, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.





Leave a Reply