
మున్సిపల్ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించాలి- కేటీఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గొప్పగా విజయాలు దక్కించుకునేలా పార్టీ నేతలు పనిచేయాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపునిచ్చారు. రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ప్రజల గురించి పట్టించుకునే తీరిక, ఉద్దేశ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అందుకే ఇచ్చిన అన్నీ హమీలను తుంగలో తొక్కిందని కెటిఅర్ అన్నారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ మళ్లీ గులాబీ గూటికి చేరుకోవడంతో ఆయనను పార్టీలోకి కేటిఆర్ ఆహ్వానించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాకుండా రానున్న ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ జెండాకు, కారు గుర్తుకు మద్దతు ఇచ్చి కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్, 12 ఏండ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయకుండా టైంపాస్ చేస్తున్నాయని, అందుకే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందని కేటీఆర్ అన్నారు.రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల్లో తెచ్చిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఎలాంటి అభివృద్ది చేసారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత వర్ధన్నపేటలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.







Leave a Reply