NewsInn

News in a Click

వ‌సూళ్లు….పంప‌కాలు మీకే బాగా తెలుసు

నేను నిజాయితీగా ప‌నిచేస్తున్నా

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌)

వ‌సూళ్లు, పంప‌కాలు ఎలా చేయాలో బీఆర్ ఎస్ నేత‌ల‌కు తెలిసినంతగా ఎవ‌రికి తెలియ‌ద‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావ్ వ్యాఖ్యానించారు. మైక్రోబ్రూవ‌రీల అనుమ‌తి విష‌యంలో మాజీ మంత్రి హ‌రీష్ రావ్ చేసిన వ్యాఖ్య‌లకు జూప‌ల్లి కృష్ణారావ్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చిన చరిత్ర బీఆర్ ఎస్ కే ద‌క్కుతుంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం మైక్రోబ్రూవ‌రీల‌కు లాట‌రీద్వారా అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని చెప్పారు.మేము కొత్త నిబంధ‌న‌లు ఏమి తేలేద‌ని గ‌తంలో ఉన్న నిబంధ‌న‌లే అమ‌లు చేస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనుమ‌తుల కోసం నా వ‌ద్ద‌కు ఎలాంటి ఫైళ్లు రాలేదు. సంబంధిత శాఖకు ద‌ర‌ఖాస్తులు మాత్ర‌మే వ‌చ్చాయని తెలిపారు.అవ‌గాహ‌న రాహిత్యంతో మాపై హ‌రీష్ రావు బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్నారు..
సింగూర్ జలాలను బీర్ల కంపెనీలకు తరలిస్తున్నారు అని విమర్శలు చేశారు . క్రాప్ హాలిడే ప్రకటించారు అని ఆరోపణలు చేశారు .మేము కొత్తగా బీర్ల కంపెనీలకు అక్కడ అనుమతి ఇవ్వలేదు. కొత్తగాపైప్ లైన్ వేయలేదు. అవ‌న్ని గ‌త ప్ర‌భుత్వంలో ఉన్న‌వే అని మంత్రి చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ‌ రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే హ‌రీష్ రావ్ పై చేసిన వ్యాఖ్య‌ల్లో జూప‌ల్లి త‌న వ‌ర‌కు మాత్ర‌మే తాను స్ప‌ష్ట‌త ఇచ్చుకున్నారు. మైక్రోబ్రూవ‌రీలకు సంబంధించిన ఫైల్ త‌న వ‌ద్ద‌కు రాలేద‌ని, ద‌ర‌ఖాస్తులు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని చెప్ప‌డం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *