(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ ఇన్)

న్యూజీలాండ్ తో జరుగుతున్న టీ-20 సీరిస్ లో నాలుగో మ్యాచ్ లో భారత జట్టు చేసింగ్ లో తడబడింది. న్యూజీలాండ్ జట్టుముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. 216 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు 165 పరుగులకే అలౌట్ అయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు కెప్టన్ న్యూజీలాండ్ జట్టు బ్యాట్స్ మెన్లను ప్రారంభంలో కట్టడి చేయలేకపోయింది. బ్యాటింగ్ ప్రారంభించిన మొదటి ఓవర్ నుంచే ఆ జట్టు దూకుడుగా బ్యాటింగ్ చేయాలన్న లక్ష్యంగా వ్యవహరించింది. ఒపెనర్లు డెవన్ కాన్వే, టీం సెల్పర్ట్ లు భారీ స్ట్రైక్ రేట్ తో భారత బౌలర్లపై విరుచుకు పడ్డారు. సెల్పర్ట్ 36 బంతుల్లో 62 పరుగులు చేయగా 23 బంతుల్లో 44 పరుగలను కాన్వే చేశారు. దీంతో మొదటి వికెట్ భాగస్వామ్యానికి వంద పరుగులు జోడించినట్లయింది. ఓపెనర్లు ఇద్దరు కొద్ది సేపటి వ్యవధిలోనే అవుట్ కావడంతో ఆ జట్టు రన్ రేట్ తగ్గింది. ఆ తరువాత గ్లెన్ ఫిలిప్స్, డరైల్ మిచెల్ కూడా భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడంతో 20 ఓవర్లలో న్యూజీలాండ 216 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

మ్యాచ్ ను మలుపు తిప్పిన దుబే రనౌట్…
అనంతరం బ్యాటింగ్ కుదిగిన భారత జట్టుకు మొదటి బంతికే షాక్ తగిలింది. గత మ్యాచ్ లో న్యూజీలాండ్ బౌలర్లను ఆటాడుకున్న అభిషేకర్ శర్మ తొలి బంతికే అవుట్ అయ్యారు. పది పరుగులకు కూడా స్కోర్ చేరకముందే కెప్టన్ సూర్య కూమార్ పెవిలియన్ చేరుకున్నారు. సంజు శాంసన్ కుదురుకున్నట్లే కనిపించినా….. శాంసన్ సాంట్నర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఆ తరువాత రింకూ సింగ్ న్యూజీలాండ్ బౌలర్లను ప్రతిఘటించినట్లు కనిపించినా ఎల్ బీ డబ్లూ గా వెనుదిరిగారు. ఐదు వికెట్లు కోల్పోయిన తరువాత భారత జట్టు బ్యాటింగ్ శివం దుబే మెరుపులతో ఆశలు పెంచుకుంది. భారీగా షాట్లు కొడుతూ 23 బంతుల్లోనే 65 పరుగులు చేసిన దుబే మంచి ఫాంలో కనిపించారు. 7 సిక్స్ లు, 3 ఫోర్లతో దూకుడుగా ఆడుతున్న దుబే అన్యూహ్యంగా రన్ అవుట్ కావడంతో భారత జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఆ తరువాత వెంట వెంటనే భారత జట్టు వికెట్లు కోల్పోయింది. 18.4 ఓవర్లలో 165 పరుగులకు అలౌట్ అయింది. సాంట్నర్ మూడు, సోథీ, డఫీ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.





Leave a Reply