ఏర్పాట్లు పరిశీలించిన అమాత్యులు
(మేడారం, న్యూస్ ఇన్)
మేడారం సాక్షిగా… అట్టహాసాల హంగులు లేవు.. కాన్వాయ్ల ఆర్భాటాలు లేవు.. జనం మధ్యకు వెళ్లాలనే తపన.. భక్తుల కష్టాలు స్వయంగా చూడాలనే సంకల్పం! అదే తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లు మేడారం జాతర ప్రాంగణలో టూర్ చేశారు. .

గురువారం తెల్లవారు ఝామునే నుంచి కార్యక్షేత్రంలోకి దిగి అందరినీ ఆశ్చర్య పరిచారు.
మొన్నటి వరకు మేడారం అభివృద్ది పనులను పర్యవేక్షించిన ఆయన ఇప్పుడు మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి పర్యవేక్షించారు.గత రాత్రి గద్దె చేరిన పెద్దమ్మలను దర్శనం చేసుకున్న మంత్రులు తెల్లారేసరికల్లా సేవా కార్యకర్తలా రంగంలోకిదిగారు.
జిల్లా కలెక్టర్తో కలిసి బైక్పై టూర్….
వనదేవతలు కొలువైన మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రులు బైక్ ఎక్కారు. జిల్లా కలెక్టర్ టి.ఎస్.దివాకర్ను తన వెనుక కూర్చోబెట్టుకుని, స్వయంగా బైక్ నడుపుతూ పొంగులేటి జాతర ప్రాంగణంఅంతా చుట్టేశారు. జంపన్న వాగు వద్ద భక్తులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. ఈపర్యటనలో సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కూడా పాల్గొన్నారు.

ప్రజా గొంతుక కోసం.. టీ కొట్టు వద్ద ఆగారు.హడావిడి పర్యటన కాదిది.. ఒక టీ కొట్టు వద్ద ఆగి, చాయ్ తాగుతూ అక్కడున్న భక్తులతో ముచ్చటించారు. ఛాయ్ వాలాతో చమత్కరించారు. “ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సౌకర్యాలు ఎలా ఉన్నాయి?” అంటూ ఆరా తీశారు.అంతేగాకఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో అధికారులకు అక్కడికక్కడే దిశానిర్దేశం చేశారు.






Leave a Reply