అమ్మాయిలను వేధించే క్రిమినల్స్ కు భయం అవసరం
(హైదరాబాద్, న్యూస్ఇన్)

తెలంగాణా పోలీసులు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధితులు మహిళలుగా ఉన్న సమయంలో వారు పోలీస్ స్టేషన్ కు వచ్చేందుకు ఆసక్తి చూపక పోతే వారి ఇంటికి వెళ్లి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని నిర్ణయం తీసుకోవడం వారికి భరోసా ఇస్తుందన్నారు. కొంత మంది తెలిసి తెలియకో చేసిన తప్పులు, సోషల్ మీడియా ప్రభావంతో మహిళల ప్రైవసీకి భంగం వాటిల్లుతుందన్నారు. సిఐడి అధికారి చారుసిన్హా చేసిన ఈ ప్రకటనను స్వాగతిస్తున్నాని చెప్పారు. తెలంగాణా మహిళలకు ఈ నిర్ణయం పెద్ద భరోసా ఇస్తుందన్నారు. ఎంతోమంది బయటకు చెప్పకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయలు బయటకు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు పలు సూచనలు చేశారు. బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తే ….వారి వివరాలు బయట పెట్టవద్దని సూచించారు. మీడియా, సోషల్ మీడియాలు కూడా వ్యక్తి గత వ్యవహరాలకు ప్రాధాన్యత ఇవ్వరాదన్నారు.వ్యక్తుల ప్రైవసీని దెబ్బ తీయడం భావ్యం కాదన్నారు.మహిళలపై జరుగుతున్న ఘటనలకు సజ్జనార్ లాంటి పోలీసు అధికారులే సరైన ట్రీట్మెంట్ ఇస్తారన్నారు.ఇది తన వ్యక్తి గత అభిప్రాయమని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.





Leave a Reply