శాసనసభా పక్ష సమావేవంలో నిర్ణయం ..
(న్యూఢిల్లీ, న్యూస్ఇన్)
విమానప్రమాదంలో దుర్మరణం పాలైన అజీత్ పవార్ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించేందుకు ఆయన కుటుంబ సభ్యులే రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార భాగస్వామ్యంలో ఉన్న పార్టీ డిప్యూటీ సీఎం పదవిని తిరిగి తమకే దక్కేలా పావులు కదుపాలని నిర్ణయం తీసుకుంది. కొత్త నేతలు వస్తే రాజకీయంగా భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా అజీత్ పవార్ భార్య సునేత్ర దేవిని రాజకీయాల్లో క్రియా శీలం చేయాలన్న లక్ష్యంగా ఎన్ సీపీ నేతలు ఆమెను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
శరద్ పవార్ వారసత్వంగా ఆ కుటుంబ సభ్యులందరీకి సుదీర్ఘంగా రాజకీయాలతో అనుబంధం ఉంది. శరద్ పవార్ ను విబేధించి గతంలో ఆజీత్ పవార్ బీజెపితో కలిసి నడవడంతో కుటుంబంలో విబేధాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఎవరికి వారే రాజకీయంగా తమ ప్రణాళికలను అమలు చేస్తూ వచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఆజీత్ పవార్ దుర్మరణం చెందారు. బారమతిలోనే జరిగిన విమన ప్రమాదంలో ఆయన మృతి చెందారు.

ఈ సంఘటనతో పవార్ కుటుంబ సభ్యుల్లో కూడా పునరాలోచనలో పడేలా చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ కురవృద్ధుడిగా ఉన్న శరద్ పవార్ సూచనల మేరకు నిర్ణయం తీసుకోవాలని అజీత్ పవార్ కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా శరద్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి మృతి సోదరుడి భార్య సునేత్ర పవార్ ఆసక్తిగా ఉంటే ఆమెకే కట్టబెట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆసక్తి గా లేకపోతే సుప్రియా సూలే లేదంటే ప్రఫూల్ పటేల్ కు ఆ పదవిదక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
దీంతో పాటు త్వరలో జరిగే ఎన్సీపీ శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి తిరిగి పవార్ కుటుంబ సభ్యులంతా రాజకీయంగా కలిసే ఉండేలా పార్టీ నేతలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలు దీనిపై సానుకూలంగా ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. రెండుగా చీలిన ఎన్సీపి ఒకే పార్టీగా అవతిరిస్తే మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు మళ్లీ మారనున్నాయి. ఫిబ్రవరి మూడో వారం లోపు ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలు అమలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.




Leave a Reply