NewsInn

News in a Click

కేసిఆర్ కు మ‌రోసారి సిట్ నోటీసులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మాజీ ముఖ్య‌మంత్రి కేసిఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించేందుకు మ‌రోసారి నోటీసులు అంద‌చేశారు. రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేయ‌డంతో పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాలు, మున్సిప‌ల్ నామినేష‌న్ల ప్ర‌క్రియ కార‌ణంగానే విచార‌ణ‌కు 30వ తేదీన హాజ‌రు కాలేన‌ని స‌మాచారం ఇచ్చారు. కేసిఆర్ స‌మాచారాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సిట్ శుక్ర‌వారం రాత్రి 9.30 గంట‌ల ప్రాంతంలో మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. నందిన‌గ‌ర్ నివాసానికి వ‌చ్చిన సిట్ అధికారులు కేసిఆర్ కుటుంబ స‌భ్యులు కానీ, వ్య‌క్తి గ‌త సిబ్బంది కాని అందుబాటులో లేక‌పోవ‌డంతో కేసిఆర్ నివాసం ద‌గ్గ‌ర గోడ‌కు సిట్ నోటీసులు అతికించారు.

విచార‌ణ కోసం ఎర్ర‌వ‌ల్లి వ్య‌వ‌సాయ క్షేత్రానికి పోలీసులను కేసీఆర్ రావాల‌ని కోరారు. కానీ ఈ రోజు ఇచ్చిన నోటీసుల్లో విచార‌ణ కోసం ఒక‌టో తేదీన హైద‌రాబాద్ లో అందుబాటులో ఉండాల‌ని కేసిఆర్ ను పోలీసులు కోరారు. దీంతో బీఆర్ ఎస్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న‌ది ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది. ఆదివారం విచార‌ణ కు అందుబాటులో ఉండాల‌ని పోలీసులు నోటీసుల్లో వెల్ల‌డించ‌డంతో బీఆర్ ఎస్ ఆలోపు న్యాయ స్థానాల‌ను ఏమైనా ఆశ్రయిస్తుందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఒక్క రోజు మాత్ర‌మే ఉండ‌డంతో ఈ విష‌య‌మై బీఆర్ ఎస్ అధినేత తీసుకునే నిర్ణ‌యంపై స‌స్పెన్స్ నెల‌కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *