
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ నగర శివారులో విషాద సంఘటన చోటుచేసుకుంది.ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే ట్రాక్ ను వారు ఆత్మహత్య చేసుకునేందుకు ఎంచుకున్నారు.చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎం ఎం టి ఎస్ డౌన్ లైన్ లో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుందని పోలీసులు గుర్తించారు. బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి, పి.విజయ,పి.చేతన రెడ్డిగా గుర్తించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మీరు ఆత్మహత్యకే పాల్పడ్డారా లేదా మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు.




Leave a Reply