(హైదరాబాద్, న్యూస్ఇన్)
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నంది నగర్ నివాసానికి పోలీసులు నోటీసులు అతికించడం పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మార్గపు పాలన అంటూ మండిపడ్డారు. పోలీసులు అత్యుత్సాహం చూపుతూ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. ఎక్స్ లో తన అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు.స్వయంగా కేసీఆర్ తానుంటున్న నివాసం అడ్రస్తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణమని
ఇది అహంకారం కాకపోతే మరేమిటి?
65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?
చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం.
మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు.


Leave a Reply