NewsInn

News in a Click

మున్సిపోల్స్ పై పొంగులేటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మున్సిపోల్స్ పై పొంగులేటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఈ ఎన్నిక‌లు మాకు సెమి ఫైన‌ల్స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పుర‌పాల‌క ఎన్నిక‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం సెమీ ఫైన‌ల్స్‌గా భావిస్తోంద‌ని, ఈ ఎన్నిక‌ల్లో త‌మ‌కు స‌రైన పోటీయే లేద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శనివారం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం మొద‌లు పెట్టారు. పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం నుంచి ప్రారంభించి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, వర్ధన్నపేట జనగాం మున్సిపాలిటీల్లో ప‌ర్య‌టించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గత దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆనాటి పాలకులు తమ అకౌంట్లు నింపుకోవాలని చూశారే తప్ప, సామాన్యుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. గ‌తంలో పంచాయితీ రాజ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు మంచి ఆధిక్య‌త వ‌చ్చింద‌ని, అదే ఫ‌లితం ఇప్పుడు పుర‌పాలిక‌ల్లో కూడా పున‌రావృతం కాబోతోంద‌న్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఈ ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని జోస్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *