అర్షదీప్ కు ఐదు వికెట్లు
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
న్యూజీలాండ్ తో జరుగుతున్న ఐదు టీ-20 సీరీస్ లో భారత్ 4-1 తో సీరీస్ ను చేజిక్కించుకుంది. తిరువనంత పురంలో జరిగిన చివరి మ్యాచ్ లో భారత జట్టు చేసిన భారీ స్కోరును చేధించే క్రమంలో కూడా న్యూజీలాండ్ జట్టు అద్భుత పోరాట ప్రతిమను ప్రదర్వించింది. 19.4 ఓవర్లలో 225 పరుగులు చేసింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 272 భారీ పరుగల లక్ష్యాన్ని న్యూజీలాండ్ ముందు ఉంచింది. భారత జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు మినహా అంతా రాణించారు.మొదటి ఓవర్ నుంచే ఓపెనర్లు భారీ స్కోరు లక్ష్యంగా బ్యాటింగ్ మొదలు పెట్టారు. అభిషేక్ శర్మ, సంజుశాసన్ లు ఇన్నింగ్స్ ప్రారంభించారు. 3 ఓవర్లలో 31 పరుగులు సాధించిన తరువాత సంజుశాంసన్ మరోసారి నిరాశ పరుస్తూ తొలి వికెట్ గా వెనుదిరిగారు. ఐదో ఓవర్ వచ్చే వరకు స్కోరు 48 పరుగులకు చేరుకుంది ఆ సమయంలో అభిషేక్ శర్మ కూడా అవుట్ కావడంతో భారీ స్కోరుకు బ్రేకులు వేశామని న్యూజీలాండ్ బౌలర్లు ధీమాగా కనిపించారు. ఆ తరువాతే అసలు కష్టాలు న్యూజీలాండ్ బౌలర్లకు మొదలయ్యాయి.

ఇషాన్ కిషన్ కిషన్, కెప్టన్ సూర్యకుమార్ యాదవ్ లు బ్యాటింగ్ లో ప్రతాపాన్ని చూపించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఎక్కడా రన్ రెట్ తగ్గకుండా ఫోర్లు, సిక్సర్లతో భారీ స్కోరు సాధించే విధంగా బ్యాటింగ్ చేశారు. 5 ఓవర్ నుంచి 15 వ ఓవర్ వచ్చే వరకు వీరి భాగస్వామ్యం 185 పరుగులకు చేరుకుంది. ఆ సమయంలో సూర్య 30 బంతుల్లో 63 పరుగులు చేసి ఔటయ్యారు మరో వైపు ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్ జోరును కొనసాగింది సెంచరీ నమోదు చేసుకున్నారు. 43 బంతుల్లో సెంచరీ చేసిన ఇషాన్ 10 సిక్సర్లు 4 ఫోర్లు కొట్టారు. సెంచరీ తరువాత భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించారు. 17 బంతుల్లో 42 పరుగులు చేశారు.20 ఓవర్లు పూర్తయ్యే వరకు రింకూసింగ్, శివమ్ దుబేలు 8, 7 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, 23 సిక్సర్లు ఉన్నాయి.

ఆతరువాత 272 పరుగల లక్ష్యంగా బ్యాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ ఆది లోనే ఓ వికెట్ కోల్పోయింది. భారీ లక్ష్యాన్ని చేధించాలన్న లక్ష్యంగా న్యూజీలాండ్ బాటర్లు తమ బ్యాట్లు ఝుళిపించారు. 9 ఓవర్లలో 117 పరుగులు సాధించారు ఆ సమయంలో జోరు మీదున్న ఫెన్ అలెన్ ఔట్ కావడంతో భారత్ జట్టు మరింత పట్టు భిగించేలా పావులు కదిపింది. అలెన్ 38 బంతుల్లో 80 పరుగులు చేసి ఔటయ్యారు. ఆతరువాత రచిన్ రవింద్ర మినహా న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్లు పెద్దగా స్కోరు సాధించ లేకపోయారు. భారీ లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యంగా పరుగులు రాబట్టే క్రమంలో తమ వికెట్లు పారేసుకున్నారు. భారత బౌలర్లపై కూడా అటాక్ చేసిన న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ లు బూమ్రా బౌలింగ్ లో భారీగా పరుగులు రాబట్టుకున్నారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ ఐదు వికెట్లు తీసి న్యూజీలాంట్ ఓటమిని శాసించారు.అక్సర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టారు. 19.4 నాలుగు ఓవర్లలో 225 పరుగులకు న్యూజీలాండ్ అలౌట్ అయింది.










Leave a Reply