NewsInn

News in a Click

కేసీఆర్ విచారణ – ఆదివారం ఆంక్షలు

Hysterical Traffic Police Advisory

బంజారా హిల్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు

(హైదరాబాద్,న్యూస్ఇన్)

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆదివారం మధ్యాహ్నం తర్వాత సిట్ అధికారులు ఫోన్ టాపింగ్ విషయంలో విచారించనున్నారు. నంది నగర్ లోని కెసిఆర్ నివాసంలోనే విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అవసరానికి అనుగుణంగా మళ్ళి ఇప్పుడు కూడా ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.అవసరాన్ని బట్టి ఈ క్రింది ప్రదేశాలు/మార్గాలలో ట్రాఫిక్ నిలిపివేయబడుతుంది లేదా మళ్లించబడుతుంది

  • నంది నగర్ బస్ స్టాప్.
  • నంది నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం.
  • జెసి రెడ్డి చికెన్ సెంటర్.
  • యూనియన్ బ్యాంక్ బై-లేన్.
  • బసవతారకం రోటరీ.
  • అగర్సేన్ జంక్షన్.
  • టిఎస్ స్టడీ సర్కిల్.
  • ఎన్టీఆర్ భవన్.
  • ఎంఆర్‌సి కమాన్, రోడ్ నెం.12.
  • సాగర్ సొసైటీ ‘టి’ జంక్షన్.

పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు తీసుకునే నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఆ మార్గాల్లోకి రావద్దని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *