
బంజారా హిల్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆదివారం మధ్యాహ్నం తర్వాత సిట్ అధికారులు ఫోన్ టాపింగ్ విషయంలో విచారించనున్నారు. నంది నగర్ లోని కెసిఆర్ నివాసంలోనే విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అవసరానికి అనుగుణంగా మళ్ళి ఇప్పుడు కూడా ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.అవసరాన్ని బట్టి ఈ క్రింది ప్రదేశాలు/మార్గాలలో ట్రాఫిక్ నిలిపివేయబడుతుంది లేదా మళ్లించబడుతుంది
- నంది నగర్ బస్ స్టాప్.
- నంది నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం.
- జెసి రెడ్డి చికెన్ సెంటర్.
- యూనియన్ బ్యాంక్ బై-లేన్.
- బసవతారకం రోటరీ.
- అగర్సేన్ జంక్షన్.
- టిఎస్ స్టడీ సర్కిల్.
- ఎన్టీఆర్ భవన్.
- ఎంఆర్సి కమాన్, రోడ్ నెం.12.
- సాగర్ సొసైటీ ‘టి’ జంక్షన్.
పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు తీసుకునే నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఆ మార్గాల్లోకి రావద్దని సూచిస్తున్నారు.


Leave a Reply