(హైదరాబాద్, న్యూస్ఇన్ )
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారించనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్ని గ్రామాల్లో నిరసన తెలిపాలని బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో పోలీసు శాఖ అప్రమత్తమయింది. అడిషనల్ డీజీపీ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.కమిషనర్లు, ఎస్పీలకు అలర్ట్ మెసేజ్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ చీఫ్.బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉన్నందున తగిన ముందస్తు చర్యలు తీసుకొవాలని ఆదేశాలు.విచారణ పూర్తయ్యేంత వరకు ఎక్కడిక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ.

ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ నంది నగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నగరంలోని నంది నగర్ పరిసర ప్రాంతాలతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సహా ఆ ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని ముందుగానే ట్రాఫిక్ మళ్లింపు హెచ్చరికలు కూడా చేశారు.

కెసిఆర్ విచారణ సందర్భంగా పెద్ద ఎత్తున గులాబీ పార్టీ నేతలు తెలంగాణ భవన్ కు చేరుకునే అవకాశం ఉందని పోలీసులు అర్చన వేస్తున్నారు. పార్టీకి నేతలతో కేసీఆర్ విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ భవన్లోనే అందుబాటులో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ కూడా నగరం నలుమూలల నుంచి తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున క్యాడర్ చేరుకునే అవకాశం ఉంది.నందినగర్ లోని కెసిఆర్ నివాసానికి ఉదయం నుంచి పోలీసుల భద్రత పటిష్టం చేశారు. నివాసానికి వెళ్లే దారుల్లో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి స్థానికులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులను నంది నగర్ నివాసం చుట్టూ మొహరించారు. కెసిఆర్ ఎర్రవల్లి నుంచి 12 వరకు నందినగర్ నివాసానికి చేరుకునే అవకాశం ఉంది

తెలంగాణ భవన్ లో కూడా ముందస్తుగా కార్యకర్తల కోసం అని ఏర్పాట్లు చేశారు. దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది కార్యకర్తలు తెలంగాణ భవన్ కు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరవుతారని ఏర్పాటు చేశారు.తెలంగాణ భవన్ లో సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డిజిటల్ బోర్డులను ఏర్పాటుచేశారు.



Leave a Reply