
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
కేంద్ర ప్రభుత్వం 2026-2027 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ ను ఆదివారం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పె ట్టారు. వరుసగా 9వ సారి ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా వివిధ రంగాలకు కేటాయించిన నిదులు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియచేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు…..
రవాణా రంగానికి అత్యధికంగా రూ. 5,98,520 కోట్లు కేటాయించగా, గ్రామీణాభివృద్ధికి రూ. 2,73,108 కోట్లు, రక్షణ రంగానికి రూ. 5,04,585 కోట్లు కేటాయించారు. హోం వ్యవహారాలకు రూ. 2,55,734 కోట్లు, వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు రూ. 1,62,671 కోట్లు వెచ్చించనున్నారు.
అలాగే విద్య శాఖకు రూ. 1,39,309 కోట్లు, సామాజిక సంక్షేమానికి రూ. 1,09,025 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ. 1,04,599 కోట్లు కేటాయించారు.
పట్టణాభివృద్ధికి రూ. 85,522 కోట్లు, ఐటీ మరియు
టెలికాం రంగానికి రూ. 74,560 కోట్లు, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖకు రూ. 70,206 కోట్లు కేటాయింపులు చేశారు.
అలాగే శాస్త్రీయ విభాగాలకు రూ. 55,756 కోట్లు, పన్నుల పరిపాలనకు రూ. 45,500 కోట్లు, విదేశాంగ వ్యవహారాలకు రూ. 22,119 కోట్లు, ఆర్థిక శాఖకు రూ. 20,649 కోట్లు కేటాయించారు.
ఉత్త, తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి రూ. 6,812 కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్లు బడ్జెట్లో పేర్కొన్నారు.





Leave a Reply