NewsInn

News in a Click

బీఆర్ఎస్ అంటేనే బ్లాక్ మేయిల్ రాష్ట్ర స‌మితి

పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌)

బీఆర్ ఎస్ రాష్ట్రంలో ఆరాచ‌క పాల‌న జ‌రిగింద‌ని, ఆ పాల‌న‌పైనే త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపిస్తోంద‌ని పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్ర‌మేయం ఉన్న నేత‌లు ఎదుర్కొంటున్నార‌ని, ఇది తీవ్ర‌మైన నేర‌మ‌ని వ్యాఖ్యానించారు. కేటీఆర్ హరీష్ సంతోష్ మాదిరి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి విచార‌ణ జ‌రుపుతోంద‌ని దీనికి కేసిఆర్ నీతి మంతుడ‌ని గగ్గోలు పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.చ‌ట్టం ముందు అంతా స‌మానులే అని…చ‌ట్ట ప‌రంగా జ‌రుగుతున్న విచార‌ణ‌పై నింద‌లు వేయ‌డం త‌గ‌ద‌ని చెప్పారు. గ‌తంలో శిబూసోరెన్, మాయావ‌తి, జ‌య‌ల‌లిత‌, ల‌లూ ప్ర‌సాద్, య‌డ్యూర‌ప్ప లాంటి మాజీ ముఖ్య‌మంత్రులు విచార‌ణ ఎదుర్కొన్న విష‌యాన్ని మ‌హేష్ కుమార్ గుర్తు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంద‌న్నారు. కానీ దీన్ని దుర్వినియోగం చేస్తూ గ‌త ప్ర‌భుత్వం పారిశ్రామిక వేత్తలు, సినీతారల ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నవారు ఎంతంటి వారైనా శిక్షర్హులే అని అన్నారు. \సిట్ విచార‌ణ ద్వారా ట్యాపింగ్ విష‌యంలో వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *