భారత్ ను ఆదుకున్న వేదాంత్ త్రివేది
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
చిరకాల ప్రత్యర్థులైన భారత- పాక్ జట్ల ఏమ్యాచ్ జరిగినా అది ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. బ్యాట్స్ మెన్లు పెద్దగా రాణించకపోవడంతో…నామమాత్రపు స్కోరు 49.5 ఓవర్లలో 252 పరుగులు సాధించింది. ఇది ప్రత్యర్థి జట్టును కట్టడి చేసేందుకు సరిపడే స్కోరు అయినా…మ్యాచ్ కాపాడుకునే స్థాయిలో పరుగులు చేయకపోవడంతో ఆసక్తి కరంగా మారుతోంది.
వైభవ్ సూర్యవంశీ(30)తో పాటు టాపార్డర్ లో. వేదాంత్ త్రివేది 68)హాఫ్ సెంచరీతో బ్యాటింగ్ లో రాణించారు. చివర్లో కాన్షిక్ చౌహన్ 35, ఖిలాన్ పటేల్ 21 హిట్టింగ్ తో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది.పాకిస్థాన్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్3/32, మొహమ్మద్ సయ్యమ్2/69 వికెట్లు పడగొట్టారు. అలీరాజా, అహ్మద్ హుస్సేన్, మోమిన్ ఖమర్, అలీ హసన్ బలోచ్ తలో వికెట్లు దక్కించుకున్నారు.

నిరాశపర్చిన వైభవ్, మాత్రేలు…
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టులో స్టార్ బ్యాట్సె మెన్ గా గుర్తింపు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ దూకుడైన ఆరంభాన్ని అందించినా…. పూర్త స్థాయిలో రాణించలేకపోయారు. 30 పరుగుల స్కోరు సాధించేందుకు రెండు లైఫ్ లో లభించినా దాన్ని అందిపుచ్చుకోలేకపోయారు మరుసటి బంతికే కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కెప్టన్ ఆయుష్ మాత్రే డకౌటయ్యాడు. మరుసటి ఓవర్ తొలి బంతికే మరో ఓపెనర్ ఆరో జార్జ్ అవుట్ కావడంంతో…. భారత జట్టు 4 బంతుల వ్యవధిలోనే భారత్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ కు వచ్చిన వేదాంత్ త్రివేది ఆచి తూచి ఆడుతూ భారత జట్టు గౌరవ ప్రదమైన స్కోరు సాధించేలా పరుగులు రాబట్టారు. విహాన్ మల్హోత్ర(21) కలిసి నాలుగో వికెట్కు 62 పరుగులు జోడించిన అనంతరం విహాన్ మల్హోత్ర ఔటవ్వగా.. అభిజ్ఞాన్ కుండు(16) ఐదో వికెట్కు 38 పరుగులు, అంబ్రిష్తో కలిసి ఆరో వికెట్కు 35 పరుగులు జోడించారు. ఈ సమయంలో వేదాంత్ 74 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా సాగిన అతన్ని మోమిన్ క్యాచ్ ఔట్ చేశాడు. ఆనంతరం బ్యాటింగ్ వచ్చిన కాన్షిక్ చౌహాన్, ఖిలాన్ పటేల్ లు భారీగా పరుగులు రాబట్టారు.
ఆచితూచి ఆడుతున్న పాక్…
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ జట్టు భారత జట్టుపై విజయం సాధించాలన్న లక్ష్యంగా ఆచి తూచి ఆడుతోంది. 33 ఓవర్లలో ఆ జట్టు 166 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పయింది. భారత జట్టు బౌలర్లు పాక్ జట్టును కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒపెనర్ హంజా జహూర్49 బంతులో 42 పరుగులు చేసి ఔట్ అయ్యారు. మరో ఓపెనర్ సమీర్ మినహాస్ 9 పరుగులకే వెనుదిరిగారు. ఉస్మాన్ ఖాన్, ఫర్హాన్ యూసుఫ్ లు ఆచి తూచి బ్యాటింగ్ చేశారు. ఫర్హనా్ 38 పరు గులకు ఔటయ్యారు. దీంతో మ్యాచ్ ఆసక్తి కరంగా మారింది.







Leave a Reply