వెల్లడించిన సీఎం చంద్రబాబు
ప్రజావేదికకు ఇ-సైకిల్ తో ర్యాలీగా వచ్చిన సీఎం
(అమరావతి,న్యూస్ఇన్)
మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, మహిళా అభివృద్ధి కోసం టీడీపి నిరంతరం పథకాలు అమలు చేసిన చరిత్ర ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం కల్పించింది టీడీపీనే అని అన్నారు. ఆస్తిలో సమాన హక్కు ఎన్టీఆర్ కల్పిస్తే తాను 33 శాతం రిజర్వేషన్లను ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అమలు చేసినట్టు వివరించారు. త్వరలో చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు రానున్నాయన్నారు. సమీప భవిష్యత్తులో మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఎదుగుతారని అన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ ద్వారా లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేసే లక్ష్యాన్ని మరింత పెంచుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు.గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ఐదేళ్ల పాటు పట్టిన పీడతోనే కష్టాలు…
విధ్వంస పాలనతో రాష్ట్ర అభివృద్ధిని వెనక్కు నెట్టారని.. వైసీపీ ఐదేళ్ల పాలన కారణంగానే కూటమి ప్రభుత్వానికి వారసత్వ సమస్యలు వచ్చాయని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. ప్రజల ఆస్తులపై ఫొటోలు వేసుకున్నారని, గెలాక్సీ గ్రానైట్ తో సరిహద్దు రాళ్లు తయారు చేయించి వాటిపై బొమ్మలు ముద్రించారని అన్నారు. దీనికోసం రూ.700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. దుర్మార్గం చేసింది చాలక తమ పాలనే బెటర్ అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.
ఇ-సైకిళ్ల పంపిణీ….
పర్యావరణ పరిరక్షణ- సాధికారత లక్ష్యంగా మహిళలకు ఇ-సైకిళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిణీ చేశారు. 24 గంటల వ్యవధిలో 5555 సైకిళ్లను లబ్దిదారులకు పంపిణీ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డును కుప్పం నియోజకవర్గం నమోదు చేసింది. ఇ-సైకిళ్లను ఇంత పెద్ద సంఖ్యలో పంపిణీ చేయటంపై ఈ రికార్డు నమోదు అయినట్టు గిన్నీస్ వరల్డ్ బుక్ అజుడికేటర్ ప్రకటించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సైకిళ్ల తయారీ సంస్థ ఇ-మోటరాడ్ ప్రతినిధులకు సర్టిఫికెట్ అందించారు. కుప్పాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5555 ఇ-సైకిళ్లను పంపిణీ చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కడుపల్లెలోని తన నివాసం నుంచి ముఖ్యమంత్రి ఇ- సైకిళ్లపై ర్యాలీగా ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు ఏడు కిలోమీటర్ల మేర హుషారుగా సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకుఉన్నారు.










Leave a Reply