తక్కువ సమయం ఉండడంతో భారీగా నామినేషన్లు
ఉపసంహరణకు ఊ..హు అంటున్న నేతలు
(హైదరాబాద్, న్యూస్ఇన్)
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు నామినేషన్ల ఉపసంహరణ ఫీవర్ పట్టించింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన మరుసటి రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టింది. రాజకీయ పార్టీలు ఆయా వార్డులు/డివిజన్ల వారీగా అభ్యర్థుల రిజర్వేషన్లకు అనుగుణంగా కసరత్తు చేసే పని ఆలోపు కూడా పూర్తి చేసుకోలేకపోయాయి. నామినేషన్ల ఘట్టం మొదలు కావడంతో రిజర్వేషన్ కేటగిరీలో ఆసక్తిగా ఉన్న పార్టీ ల నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి ఉపసంహరణ ప్రక్రియ మొదలు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలకు నామినేషన్ల ఉపసంహరింపచేసేందుకు తల ప్రాణం తోకకు వచ్చినంత పనవుతుంది. అధికార పార్టీ ఈ సమస్యను అత్యధిక మునిసిపాలిటీల్లో ఎదుర్కొంటుంది. మంగళవారం నామినేషన్ల సంహరణకు చివరి తేదీ కావడంతో… పిసిసి సోమవారం మధ్యాహ్నం అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. నామినేషన్లు వేసిన నేతలంతా అధికారిక జాబితాలో తమ పేరు ఉంటుందని ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూసారు. ఆశించిన వారందరికీ టికెట్లు దక్కడం అసాధ్యమే… దీంతో అంతకుముందే పోటీలో ఉందామని నామినేషన్ దాఖలు చేసిన నేతలు… టికెట్ దక్కకపోవడంతో రెబల్స్ గా బరిలో ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ హై కమాండ్ అధికారిక జాబితా వెల్లడించడంతో… రెబల్స్ ను పోటీ నుంచి తప్పించేందుకు నేతలు,ఇంచార్జి లు కుస్తీ పడాల్సి వస్తోంది.

రెబల్ గా అధికార పార్టీ అభ్యర్థి రంగంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఆస్థానంలో విజయం సాధించడం ఇబ్బందికరంగా మారుతుంది. ప్రతిపక్ష పార్టీల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. కొన్ని స్థానాలకు ఒకరికి మించి నామినేషన్లు వేయడంతో వారిని ఉపసంహరింపజేయడం కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బిజెపిలకు ఇబ్బందికరంగా మారుతుంది. కొంతమంది కాంగ్రెస్ టికెట్ ఆశించిన నేతలు ఇక్కడ టికెట్ సాధ్యం దక్కకపోతే చివరి నిమిషంలోనైనా పార్టీ మారి ప్రధాన ప్రతిపక్ష పార్టీ టికెట్ పై పోటీ చేయాలన్న ఆలోచనతో గులాబీ నేతలతో కూడా టచ్ లో ఉన్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులు లేని చోట్ల అధికార పార్టీ కూడా కొన్ని ప్రాంతాల్లో చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది…. అభ్యర్థి కోసం ఏ పార్టీలో కేటగిరి అభ్యర్థి బలంగా ఉంటే వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బి ఫామ్ లు ఇస్తామన్న గ్యారెంటీ ఇచ్చి అధికార పార్టీ నామినేషన్లు వేయించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వార్డుల్లో ఒకరికి మించి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పార్టీ తరపున ఒక్కరే అభ్యర్థిని రంగంలో ఉంచాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు రెబల్స్ తో చర్చలు మొదలుపెట్టాయి.ఖచ్చితంగా పోటీ చేయాలన్న యోచనలో ఉన్న నేతలు అధికారికంగా అభ్యర్థి గా ఖరారు కాకపోతే…. రెబల్ గా బరిలో ఉంటామని తేల్చి చెబుతుండడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టానికి తెరపడునుంది. ఆలోపు ఎంత మంది పార్టీ బడా నేతల సూచనలతో నామినేషన్లను ఉపసంహరించుకుంటారు అన్నది కీలక నేతలకే అంతుచిక్కడం లేదు.
కాంగ్రెస్, బిజెపిలకు చెందిన రాష్ట్ర నేతలు ఇప్పటికే పార్టీ నుంచి రెబల్స్ గా బరిలో ఉన్న అభ్యర్థులు రేపటి లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో పార్టీ క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. బి ఆర్ ఎస్ పార్టీ మాత్రం మెజారిటీ స్థానాల్లో ఒక్కొక్క అభ్యర్థిని ఖరారు చేసినా… ముందు చూపుతో మాత్రమే రెండో అభ్యర్థితో నామినేషన్ వేయించింది. కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులను పరిశీలించి బీఆర్ఎస్ ఒకరినే బరిలో ఉంచుతామని ముందుగానే సంకేతాలు ఇచ్చింది. కొన్నిచోట్ల మాత్రం బీఆర్ఎస్ కు కూడా రెబల్స్ బెడద తప్పడం లేదు
POLITICAL PARTIES REBELS ISSUES, TOMMOROW LAST DAY FOR WITHDRAWAL,
MAIN PARTIES FACING PROBLEMS,
ALL PARTIES WARNED REBELS,
SOME CANDIDATES ARE NOT AVAILABLE,




Leave a Reply