సోషల్ మీడియాలో పాక్ జట్టు పై సెటైర్లు
పీసీబీ నిర్ణయాన్ని ఎండగడుతున్న మాజీలు
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
మరో నాలుగు రోజుల్లో మొదలయ్యే టీ-20 ప్రపంచ కప్ క్రికెట్ లో పాల్గొనేందుకు పాక్ క్రికెట్ బోర్డు అనుమతి ఇచ్చినా….హై ఓల్టేజీ మ్యాచ్ లో భారత జట్టుతో పాల్గొనే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో క్రికెట్ ప్రపంచలో పాకిస్తాన్ బోర్డు, జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ మాజీ క్రికెటర్లు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐసీసీ కూడా పాక్ కు హెచ్చరికలు చేసింది. షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని తేల్చి చెపింది.
పాక్ నిర్ణయం పై అభిప్రాయాలు…

సునీల్ గవాస్కర్………..
పాక్ క్రికెట్ కు ఇలాంటివి కొత్త కాదు…ఆ జట్టు క్రీడాకారులు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారు. మళ్లీ జట్టు తరపున బరిలో దిగుతారు. అభిమానుల కోసం అని సెలవిస్తారు…. భారత జట్టుతో మ్యాచ్ బహిష్కరణ అంశం 15 వ తేదీ వరకు ఆ జట్టు తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిందే…..

రమీజ్ రాజా…..
ఐసీసీ ఇచ్చే నిధులపైనే పాక్ క్రికెట్ బోర్డు 50 శాతం ఆధారపడి ఉంటుంది 90 శాతం ఐసీసీకి నిధులు బీసీసీఐ అందుతాయి. రేపు భారత ప్రధాని బీసీసీఐ పాక్ జట్టుకు ఆర్ధిక సహాయం చేయదని ప్రకటిస్తే పాక్ క్రికెట్ బోర్డు మూత పడక తప్పుదు

రికీ పాంటింగ్…..
ప్రపంచ కప్ లో భారత్ చేతిలో ఓడిపోతామనే భయంతోనే పాకిస్తాన్ ఇకపై భారత జట్టుతో ఆడలేమని చేతులెత్తేసింది. ఇందు కోసం బహిష్కరణ అనే సాకును ముందుకు తెచ్చింది. భారత్ ను పాక్ ఎప్పుడూ ఓడించలేదని మనందరికీ తెలుసు.ప్రపంచకప్ లో ఎప్పుడైనా భారత జట్టే విజయం సాధించింది. కానీ ఈ వాస్తవాన్ని కప్పి పుచ్చేందుకు ఇదంతా చేస్తోంది.
కెవిన్ పీటర్సర్…
ప్లే ఆప్ లెక్కల ప్రకారం ప్రపంచకప్ ఫైనల్ భారత్- పాక్ తలపడుతాయో లేదో ఖచ్చతంగా చెప్పలేం. కానీ అది జరిగే పాకిస్తాన్ ప్రపంచ కప్ ఫైనల్ ఆడడానికి నిరాకరిస్తుందా అని ప్రశ్నించారు.









Leave a Reply