భారత్ తో మ్యాచ్ బహిష్కరణకు మూల్యం…?
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రపంచ కప్ లో పోటీపడుతున్న జట్లు అప్పుడుప్పుడు బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం జరుగుతూనే ఉంది. గతంలో జరిగిన టోర్నమెంట్ లలో పలు జట్లు మ్యాచ్ లు బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి. కానీ దీని కోసం బలమైన కారణాలు ఉన్నాయి…. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు చూపుతున్న కారణాన్ని ఐసీసీ సీరియస్ గా భావించడం లేదు. పాక్ జట్టు ఇండియాతో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత బీసీసీ, ఐసీసీలు పలు దఫాలుగా చర్చించాయి. మంగళ లేదా బుధవారాల్లో ప్రత్యేకంగా ఈ అంశంపై ఐసీసీ కమిటీ భేటీ అయి ఎలా వ్యవహరించాలన్న అంశంపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.ఈ విషయంలో ఐసీసీ సీరియస్ గానే స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు పాక్ క్రికెట్ బోర్డు పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
ఐసీసీ పరిశీలిస్తున్న అంశాలు ……..

పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ సమకూర్చే ఆదాయాన్ని నిలిపివేయడం
మ్యాచ్ బహిష్కరణతో వచ్చే నష్టాన్ని చెల్లించాలని నిబంధన విధించడం
పీఎస్ఎల్ లో పాల్గొనేందుకు వచ్చే క్రికెటర్లకు ఎన్ఓసీ ల మంజూరు నిలిపివేయడం
భవిష్యత్తు ఐసీసీ టోర్నమెంట్లకు అనుమతి నిరాకరించడం
ICC టోర్నమెంట్లలో గతంలో బహిష్కరించినన మ్యాచ్లు …..
📍1996 ODI WC – SL vs AUS – AUS భద్రతా కారణాలతో రద్దు చేసుకుంది.
📍1996 ODI WC – SL vs WI – WI భద్రతా కారణాలతోనే రద్దు
📍2003 ODI WC – ZIM vs ENG – ENG భద్రతా కారణాలతోనే రద్దు
📍2003 ODI WC – KEN vs NZ – NZ ఉగ్రవాదుల ముప్పుతో రద్దు చేసుకుంది.
📍2026 T20 WC – PAK vs IND – PAK రాజకీయ కారణాలున్నాతెరపైకి భద్రతా అంశాలు









Leave a Reply