NewsInn

News in a Click

ఆజీత్ ప‌వార్ అంత్య క్రియల్లో హ‌స్త లాఘ‌వం

భారీగా న‌గ‌లు చోరీ

ఇటీవ‌ల జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించి మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దివంగ‌త ఆజీత్ ప‌వార్ అంత్య క్రియ‌ల‌కు ఎంతో మంది ప్ర‌ముఖులు, వేలాది మంది ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. ఈ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన వారిలో ఎంతో మంది తమ బంగారు ఆభ‌ర‌ణాలు త‌స్క‌రించిన‌ట్లు గుర్తించారు.బార‌మ‌తి లో అంత్య‌క్రియ‌లు జ‌రిగిన త‌రువాత ఒక్కొక్క‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ వ్య‌వ‌హారం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం 30 ల‌క్ష‌ల రుపాయాల‌కు పైగా విలువ చేసే అభ‌ర‌ణాలు చేతి వాటంతో దొంగిలించారిన పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో మ‌హ్మ‌ద్ యూనిస్, రాజ్ కుమార్ అథావ‌లే, ఎజాట్ మిరావ‌లి, మ‌హ్మ‌ద్ సిరాజ్, బాబు భోత్రే తో పాటు మ‌రో ఇద్దరిపై కేసు న‌మోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *