బీజెపీ నేతల భేటీ- మిత్రపక్షానికి మద్దతు

(హైదరాబాద్,న్యూస్ఇన్)
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను తెలంగాణా బీజేపీ కీలక నేతలు కలిశారు. కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజెపి అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావ్ భేటీ అయ్యారు. ఏపీలో బీజెపీ, జనసేన మిత్ర పక్షంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ను ప్రచారం చేయాలని ఏపీ బీజెపి నేతలు పవన్ కళ్యాణ్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. బీజెపీ జాతీయ అధ్యక్షుడి పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పలు మున్సిపాల్టీలో జనసేన పార్టీ నుంచి కొంత మంది అభ్యర్థులు రంగంలో ఉండడంతో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న మున్సిపాల్టీల్లో పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా….లేదంటే బీజేపీ నేతలు కోరిన చోట ప్రచారానికి సై అంటారా అన్నది సస్సెన్స్ గా ఉంది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో బీజేపీ కి సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.





Leave a Reply