NewsInn

News in a Click

ప్రణీత్ రావు డి.ఎస్.పి హోదా రద్దు

టాపింగ్ కేసులో మొదటి చర్య

Pranith Rao Demoted

(హైదరాబాద్, న్యూస్ఇన్)

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫోన్ టాపింగ్ కేసు విచారణ మొదలు పెట్టింది. కిందిస్థాయి అధికారుల నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు విచారణను పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ కేసులో ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. డీఎస్పీ హోదాలో ఉండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫోన్ టాపింగ్ విషయంలో సహకరించాలని ఆరోపణలు ఎదుర్కొన్నారు. టాపింగ్ కోసం వినియోగించిన హార్డ్ డిస్క్ లతో పాటు ఇతర పరికరాలను ప్రణీత్ రావు ధ్వంసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రణీతరావు డిఎస్పి హోదాను రద్దు చేస్తూ సిఐ హోదాకు డీమోషన్ నిర్ణయం తీసుకుంటూ వెలువరించింది. అక్రమ నిఘా కోసం ప్రణీతరావు సాంకేతిక పరికరాలను వినియోగించాలని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. ప్రభుత్వ నిబంధనలు కాకుండా ప్రైవేటు పరికరాల్లో సమాచారాన్ని సేకరించడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పరికరాలను ధ్వంసం చేశారని ఆరోపణలపై గతంలోనే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. తాజాగా వెల్లడించిన ఉత్తర్వుల్లో డీఎస్పీ హోదా రద్దు చేస్తూ సీఐ హోదా కట్టబెడుతూ ఆదేశాలు ఇచ్చింది. 2007 బ్యాచ్కు చెందిన ప్రణీత్ రావు వేగంగా పదోన్నతులు రావడం కూడా గతంలో వివాదాస్పదంగా మారింది. గత ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ప్రణీతరావు రెచ్చిపోయారని పోలీసు శాఖలోనే ప్రచారం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *