NewsInn

News in a Click

కేసీఆర్ మీ జాతికే జాతి పిత‌……!

కేసీఆర్ మీ జాతికే జాతి పిత‌……!

మున్సిప‌ల్ ఎన్నిక‌ల అనంత‌రం రైతు భ‌రోసా

అన్ని మున్సిపాల్టీలో కాంగ్రెస్ విజ‌యం

సీఎం రేవంత్ జోస్యం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి మారోసారి బీఆర్ ఎస్ నేత‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసిఆర్ ను జాతిపిత అని సంబోధించ‌డాన్ని ఆయ‌న త‌ప్పు బ‌ట్టారు .ఆయ‌న ఎవ‌రికి జాతి పితా….ఎందుకు జాతి పిత అని ఆయ‌న‌ను అనాల‌న్నారు. హ‌రీష్ రావ్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావ్ ల లాంటి వారికి మాత్ర‌మే ఆయ‌న జాతిపిత అవుతార‌ని మిగితా వారికి కాద‌న్నారు. తెలంగాణా జాతి కోసం ఆయ‌న ఎర్ర‌వ‌ల్లి ఫాం హౌస్ ను ప్ర‌జ‌ల‌కు పంచిపెట్టారా…..జ‌న్వాడ ఫాం హౌస్ ను పేద‌ల‌కు పంచారా అని ప్ర‌శ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు విచార‌ణ‌కు పిలిస్తే తెలంగాణా జాతి పిత‌ను విచార‌ణ‌కు పిలుస్తారా అని బీఆర్ ఎస్ చేస్తున్న ప్ర‌చారాన్ని ఆయ‌న త‌ప్పు బ‌ట్టారు. తెలంగాణాకు ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ జాతిపిత అవుతార‌ని సీఎం చెప్పారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మిర్యాల‌గూడ లో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ లో సీఎం బీఆర్ ఎస్ పై సీరియ‌స్ గా వ్యాఖ్య‌లు చేశారు.

ఈ ఎన్నిక‌ల్లో అన్ని మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో గ‌త రెండేళ్ల‌లోనే దాదాపు 20 వేల కోట్ల రుపాయాల వ‌ర‌కు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని వెల్ల‌డించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల త‌రువాత రైతు భ‌రోసా నిదుల‌ను విడుద‌ల చేస్తామ‌ని స‌భ‌లో సీఏం ప్ర‌క‌టించారు. ప్ర‌జా ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత అన్ని వ‌ర్గాల వారి అభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని రేవంత్ చెప్పారు. ఆర్టీసి బ‌స్సుల్లో తిరిగిన మ‌హిళ‌లు కాంగ్రెస్ కు ఓటు వేసినా…… కాంగ్రెస్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *