160 రైళ్ల నిర్వహణకు ప్రణాళిక
అవసరమైతే మరిన్ని రైళ్లు

(హైదరాబాద్,న్యూస్ ఇన్)
ఉత్తరాదిన హోలీ పండుగకు ఉన్న ప్రాధన్యత నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుంచి 160 ప్రత్యేక రైళ్లను నడపించాలని నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు మార్చి నెల నుంచి అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి దేశం లోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యే క రైళ్లను రైల్వే శాఖ నిర్వహించనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం, పాట్నా, రాజ్కోట్, సోలాపూర్, బిలాస్పూర్, దానాపూర్, రక్సౌల్, నహర్లగున్, హజ్రత్ నిజాముద్దీన్, షాలిమార్, హిసార్, లక్నో, సంత్రాగచి, మాల్డా టౌన్, ఛప్రా మరియు అనేక ఇతర ముఖ్యమైన గమ్యస్థానాల వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి. ఈ అన్ని గమ్యస్థానాల నుండి తిరుగు ప్రయాణాలను కూడా ప్లాన్ చేశారు, రెండు వైపులా ప్రయాణించే ప్రయాణీకులకు పండగ సీజన్ దృష్టిలో ఉంచుకుని నడిపించనున్నారు.గత ఏడాది రైల్వే శాఖ 1144 ట్రిప్పులు నిర్వహించగా ఈ ఏడాది 1500 ట్రిప్పులు నిర్వహించేందుకు అనుగుణంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.



Leave a Reply