- చుట్టుముడుతున్న రాజకీయ పొగ
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
హైదరాబాద్ నగరంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం చుట్టు పొలిటికల్ పొగ చుట్టుముడుతోంది. నాంపల్లిలో ఉన్న ఈ ల్యాబ్ అత్యంత ఆధునికమైన ల్యాబ్ గా గుర్తింపు ఉంది.కీలక కేసుల విచారణలో సేకరించే సాక్ష్యాలను పోలీసు శాఖ ఈ ల్యాబ్ ఇచ్చేనివేదికలపైనే ఆధార పడి కేసుల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఈ లాబొరెటరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాద సమయంలో ఆ కార్యాలయంలో సెక్యురిటీ సిబ్బందితో సహా నలుగురు ఉన్నారు.అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే మంటలను ఆర్పేందుకు అక్కడున్న సిబ్బంది ప్రయత్నం చేసినా వారి నుంచి సాధ్యం కాలేదు. అగ్నిమాపక శాఖ ఐదు ఫైరింజన్లను పంపించి ఆ భవనంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చంది. ఇది ఇప్పటి వరకు అంతా ప్రమాద ఘటనగా చెబుతున్నారు.పోలీసులు సంఘటనా స్థలాన్నిపరిశీలించి షార్ట్ సర్క్యూట్ తో ఏర్పాడిన అగ్ని ప్రమాదంగా తేల్చారు.

ఓటు కు నోటు సాక్ష్యాలు మాయం చేసేందుకే……కేటిఆర్
ఈ ప్రమాదంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కొత్త అనుమానాలు లేవనెత్తారు. ఎతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇలాంటి లాబోరెటరీల్లో అగ్ని జరిగిన అగ్ని ప్రమాద ఘటనతో ఓటు కు నోటు కేసులో సాక్ష్యాధారాలను లేకుండాప్రభుత్వం చేసిందని కేటిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తరువాత ఆయన తన అభిప్రాయాన్ని ఎక్స్ లో పంచుకున్నారు.. బీఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో ఓటు కు నోటు కేసులోప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు.. ఈ కారణంగా ఇది ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న ఘటన కాదని తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.
శ్రీరామ్ దాస్, డి ఎఫ్ ఓ…..
అగ్నిప్రమాదంతో మొదటి అంతస్తులోని వివిధ కేసులో ఉన్న సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్నిప్రమడం సంభవించింది.ఎంతో విలువైన హార్డ్ డిస్కులు డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయని డిఎఫ్ ఓ శ్రీరాందాస్ చెప్పారు.కెమికల్ లాబ్ మెటీరియల్ అంత రెండవ అంతస్తుల ఉంది
శిల్పవల్లి, సెంట్రల్ జోన్ డీసీపీ…..
ఫోరెన్సెక్ ల్యాబ్ లో అగ్న ప్రమాదంపై ఉదయం 10 గంటలకు సమాచారం వచ్చింది. ఈ అగ్న ప్రమాదం
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాద జరిగిందని శిల్పవల్లి చెప్పారు. నేర పరిశోధన సంబంధించిన ఫైలు ఎవిడెన్స్ లాబరేటరీ మొత్తం ఇక్కడనుండే ఆపరేషన్ జరుగుతుంది మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయని అన్నారు.






Leave a Reply