ఆధిపత్యమా…అభివృద్దా…. ఆలోచించాలి
మాజీ మంత్రి హరీష్ రావు
(మెదక్,న్యూస్ఇన్)
ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో పొలటికల్ హీట్ పెంచుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో దూకుడు పెంచుతున్నారు. గత కొన్ని రోజులుగా సీఎం చేసినవ్యాఖ్యలు రాజకీయంగా దూమారం రేపుతున్నాయి. కేసిఆర్ జాతిపిత కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ కౌంటర్ అటాకింగ్ మొదలు పెట్టింది. కేసిఆర్ తనంతట తాను పిలిపించుకోలేదని,తెలంగాణా సాధించిన వ్యక్తిగా , ప్రజలకు10 ఏళ్ల పాటుచేసిన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రజలే కేసీఆర్ ను జాతి పిత అని సంబోధిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సీఎం ఓ బూతు పితఅని అని వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి ఎక్కడా లేరని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము నిలదీస్తుంటే….సీఎం దాన్ని డైవర్షన్ చేసే విధంగా బూతు పురాణం ఎంచుకుంటున్నారని ఆరోపించారు. రెండేళ్ల ప్రభుత్వ హాయంలో రెండు సార్లుఇప్పటికే రైతు బంధును ఎగ్గొటారని హరీష్ రావ్ఆరోపించారు. కళ్యాణలక్ష్మి తో పాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏ మైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన4 వేల పెన్షన్ హామీ ఎప్పుడు అమలు చేస్తారన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతల తీరు హస్యా స్పదంగాఉందన్నారు. తెలంగాణాకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదని అయినా ఎన్నికల్లో తమకు ఓట్లు వేయాలని కోరుతున్నారన్నారు. బీజేపీ ఓటు వేసినా….మోరీలో వేసినట్లే అని హరీష్ వ్యాఖ్యానించారు.







Leave a Reply