హైదరాబాద్ జీఎస్టీ ఇంటెలిజెన్స్


(హైదరాబాద్,న్యూస్ఇన్)
దేశవ్యాప్తంగా నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని ఆన్ లైన్ గేమింగ్ సిండికేట్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేసింది హైదరాబాద్ జీఎస్టీ ఇంటెలీజెన్స్ విభాగం.. దేశ వ్యాప్తంగా ఈ ముఠా నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడుతుందని ఇంటెలీజెన్స్ గుర్తించింది. ప్రాథమికంగా అధికారులు 5 వేల కోట్లరుపాయాల విలువ చేసే సిండికేట్ వీరి కనుసన్నల్లో నడుస్తుందని అంచనా వేస్తున్నారు. ముంబైకి చెందిన వై.ఎస్. ప్రభు కుమార్, హైదరాబాద్కు చెందిన రాజ శేఖర్ రెడ్డి లు ఈ ముఠాలో ప్రధాన సూత్రధారులుగా అధికారులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా అక్రమ కార్యకలాపాలను సాగిస్తున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ సహా డిల్లీ, ముంబాయి లలో కూడీ జీఎస్టీ అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది.మరిన్ని వివరాలు రాబట్టేందుకు జీ ఎస్టీ అధికారులు ఈ కేసుపై దర్యాప్తు మరింత లోతుగా చేస్తున్నట్లు సమాచారం. పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.





Leave a Reply