NewsInn

News in a Click

అగ్ని ప్ర‌మాదం పై అన్నీ అనుమానాలే…!

ఓటుకు నోటు ఆధారాలున్నాయి

ప్ర‌మాదంపై విచార‌ణ‌ : డైరెక్ట‌ర్ శిఖాగోయెల్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్ర‌మాదం రాజ‌కీయంగా దూమారం రేపుతోంది. ఈ ప్ర‌మాదంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌ధానంగా ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓటు కు నోటు కేసులో విచార‌ణ‌ను ఎదుర్కొంటుండ‌డంతో ఈకేసు సాక్ష్యాధారాల‌పై బీఆర్ఎస్ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. తాజాగా బీజేపీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. ఇది ప్ర‌మాద వ‌శాత్తు చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌గా తాము భావించ‌డం లేద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తోంది.

ఈ ప‌రిస్థితుల్లో ఎఫ్ ఎస్ ఎల్ డైరెక్ట‌ర్ శిఖా గోయెల్ మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్ర‌మాదం ఘ‌ట‌న‌పై కీల‌క అంశాల‌ను వెల్ల‌డించారు. అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ఉదయం 10.08 నిమిషాలకు ఎఫ్ఎస్ఎల్ లో అగ్నిప్రమాదం సంబ‌విస్తుంద‌ని ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సిఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారని ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారని తెలిపారు.భారీగా మంటలు అంటుకోవ‌డం పొగ విస్త‌రించి ఉండ‌డంతో 1.30 గంట‌ల‌కు మంట‌లు అదుపులోకి వ‌చ్చాయ‌న్నారు. ఈ కేసులో 2015 సంవత్స‌రం నుంచి ఏసీబీకి సంబంధించి 16 మెటీరియ‌ల్స్ ధ్వంసం అయ్యాయ‌ని వెల్ల‌డించారు.

ఓటు కు నోటు కేసులో 2021 లో రిపోర్టులు ఏసీపీ కోర్టుకు అందించామ‌న్నారు. ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు ఈ కేసు వివ‌రాలు అందించింద‌న్నారు. ఇక్క‌డ ఆధారాలు ప్ర‌మాదంలో కాలిపోయినా….ఓటు కు నోటు కేసులో ఆధారాల విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు అవ‌స‌రం లేద‌న్నారు.2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్ కి సంబంధించిన ఫోన్ టాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫ్ ఎస్ ఎల్ కి వచాయన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తాము ప్ర‌మాదంలో 7 మెటీరియ‌ల్స్ కాలిపోయాయ‌ని వెల్ల‌డించారు. ఈ అగ్ని ప్ర‌మాదంపై విచార‌ణ జ‌రుపుతున్నాయ‌ని శికా గోయేల్ వెల్ల‌డించారు. ప్ర‌మాదంలో జ‌రిగిన న‌ష్టం పై ఇంకా స్ప‌ష్ట‌త లేద‌న్నారు. త్వ‌ర‌లో సంబంధించి పూర్తి వివ‌రాలు విచార‌ణ‌లో తేల‌నున్నాయ‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *