NewsInn

News in a Click

ఇంగ్లాడ్ ను ఓడించినంత ప‌ని చేసిన నేపాల్

ఇంగ్లాడ్ ను ఓడించినంత ప‌ని చేసిన నేపాల్

చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ‌

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌)

టీ-10 ప్ర‌పంచ క‌ప్ లో ప‌సికూన‌గా బ‌రిలోకి దిగిన నేపాల్ జ‌ట్టు ఇంగ్లాండ్ కు చుక్క‌లు చూపించింది. విజ‌యం సాధించ‌లేదు త‌ప్ప అన్ని విభాగాల్లో ఇంగ్లాడ్ తో స‌మానంగా పోరాడింది. చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కేవ‌లం నాలుగు ప‌రుగుల తేడాతో నేపాల్ పై విజ‌యం సాధించింది. వాంఖేడే స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని ఇచ్చింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జ‌ట్టుకు నేపాల్ బౌల‌ర్లు ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్ ఇచ్చారు. ఇంగ్లాండ్ బ రెండో ఓవ‌ర్లోనే ఫిల్ సాల్ట్ వికెట్ ఐదు ప‌రుగ‌ల వ‌ద్ద కోల్పోయింది. రెండో విక్ భాగ‌స్వామ్య‌నికి 43 ప‌రుగులు చేసిన త‌రువాత జోస్ బ‌ట్ల‌ర్ అవుట‌య్యారు. ఆ త‌రువాత 57 ప‌రుగ‌ల‌కే మ‌రో వికెట్ ఇంగ్లాండ్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు ఆచి తూచి బ్యాటింగ్ చేయాల్సి వ‌చ్చింది. 57 ప‌రుగుల‌కు మూడు వికెట్లు కోల్పోవ‌డంతో నాలుగో వికెట్ కోల్పోకుండా భారీ స్కోరు దిశ‌గా జాక‌బ్ బేథెల్- సాం క‌ర‌న్ లు 128 ప‌రుగుల‌కు స్కోరును పెంచిన త‌రువాత జాక‌బ్ బేథెల్ వికెట్ కోల్పోయింది. ఆ త‌రువాత కూడా వ‌రుస‌గా ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోతూ 20 ఓవ‌ర్ల‌లో 184 ప‌రుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ జ‌ట్టులో బేథెల్ 35 బంతుల్లో నాలుగు ఫోర్లు, 4 సిక్ల‌స‌ర్ల స‌హాయంతో 55 ప‌రుగులు చేశారు. చివ‌ర్లో విల్ జాక్స్ 18 బంతుల్లో 39 ప‌రుగులు సాధించ‌డంతో ఇంగ్లాండ్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును చేరుకుంది.

185 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన నేపాల్ జ‌ట్టు అద్భుత మైన పోరాట ప‌టిమ చూపింది. 4 ఓవ‌ర్ల‌లోనే నేపాల్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు కౌషిల్ భూతెల్, ఆసీఫ్ షేక్ లు తొలి వికెట్ కు 37 ప‌రుగులు సాధించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆత‌రువాత కూడా నేపాల్ జ‌ట్టు ఇదే జోరును కొన‌సాగిస్తూ వ‌చ్చింది.42 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయిన నేపాల్ ఆ త‌రువాత 3 వికెట్ కు భారీ భాగ‌స్వామ్యం నేపాల్ బ్యాట్స్ మెన్లు న‌మోదు చేశారు. దిపేంద‌ర్ సింగ్,రొహిత్ పాడేల్ 14.2 ఓవ‌ర్ల‌లో జ‌ట్టు స్కోరు 124 ప‌రుగులు రాబ‌ట్టారు. అక్క‌డ నేపాల్ రెండు కీల‌క వికెట్లు కోల్పోవ‌డంతో మ్యాచ్ పై ఇంగ్లాండ్ ప‌ట్టు భిగించేందుకు అవ‌కాశం ద‌క్కింది. దీపేంద‌ర్ సింగ్ 29 బంతుల్లో 44 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. రోహిత్ పౌడెల్ 34 బంతులు ఎదుర్కొని 39 ప‌రుగులు సాధించారు. 19 ఓవ‌ర్లు ముగిసే ప‌మ‌యానికి నేప‌ల్ విజ‌యం కోసం కేవ‌లం 10 ప‌రుగ‌ల దూరంలోనే ఉంది. క్రీసులో లోకేష్ బం జోరు మీద ఉండ‌డంతో నేపాల్ కు విజ‌యావ‌కాశాలు క‌నిపించాయి..కానీ వ‌త్తిడిలో నేపాల్ బ్యాట్స్ మెన్లు చివ‌రి ఓవ‌ర్లో 10 ప‌రుగులు చేయ‌లేక‌పోయారు. కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే సాధించారు…చివ‌ర‌లో 3 బంతులు ఎదుర్కొని ఆరు ప‌రుగులు చేయాల్సి ఉన్నా…..నేపాల్ సాధించ‌క‌పోవ‌డంతో నేపాల్ జ‌ట్టుతో పారాడి ఇంగ్లాండ్ నాలుగు ప‌రుగ‌ల తేడాతో విజ‌యం ద‌క్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *