(హైదరాబాద్,న్యూస్ ఇన్)
తెలంగాణ రైజింగ్… గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. గ్లోబల్ సమ్మిట్లోకి మంత్రి సురేఖ ఇందిరమ్మ చీరలో అడుగు పెట్టిన క్షణం మొదలు… అందరూ ఆత్మీయంగా ఆమెను పలకరించారు. ఇటీవల రాష్ట్రంలో చీరల పంపిణీలో భాగంగా పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరను మంత్రి కొండా సురేఖ ధరించారు.
గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం మొత్తం బ్లూ కలర్ తో నిండి ఉండడం….దాదాపు అదే రంగును పోలి ఉన్న ఇందిరమ్మ చీరతో మంత్రి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకోవడం చర్చకు దారి తీసింది.

ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న ఇలాంటి చీరలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అన్న విషయాన్ని గ్లోబల్ సమ్మేడ్ ద్వారా మంత్రి సురేఖ తెలియచేశారన్న చర్చ జరిగింది.
సురేఖక్క… ఇందిర్మమ్మ చీర బాగుంది అంటూ కితాబిచ్చారు. అటుతర్వాత మంత్రి సురేఖ దేవాదాయ, అటవీ, పర్యావరణ విభాగానికి సంబంధించిన ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొన్నారు. సమ్మిట్ తర్వాత వివిధ స్టాల్స్ ను పరిశీలిస్తున్న సందర్బంలో మంత్రి సురేఖతో… అందరూ సెల్పీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు.





Leave a Reply