పవన్ ప్రొడ్యూసర్ చంద్రబాబే
కో ప్రొడ్యూసర్ లోకేష్
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
(మహబూబ్ నగర్ ,న్యూస్ఇన్)
తెలంగాణలో ఉన్న విలెవూర భూములు కోసమే ఆంధ్రా నాయకులు తెలంగాణా పై ప్రేమ చూపిస్తున్నారని, తెలంగాణా ప్రజల మీద ప్రేమతో వారు ఇక్కడికి రావడం లేదన్నారు. తెలంగాణాలో విలువైన ఆస్తులను కాపాడుకోవడం, విలువైన భూములను చేజిక్కించడమే లక్ష్యంగా ఏపీ నేతలు పనిచేస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన దైన స్టైల్లో స్పందించారు. గతంలో తెలంగాణాలనే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినా… రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాపై పవన్ కళ్యాణ్ పెద్దగా ఫోకస్ పెట్టలేదు.

ఏపీ కేంద్రంగానే రాజకీయాలు చేసేందుకు ప్రయత్నాలుచేసి 2024 ఎన్నికల్లో విజయవంతం అయ్యారు. జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో కలిసి అధికారం చేజిక్కించుకుంది. కీలక భాగస్వామి కావడంతో పవన్ కు డిప్యూటీ సీఎం పదవి వరించింది. అప్పటి నుంచ ఇ అప్పడప్పుడు తెలంగానా రాజకీయాల్లో కూడా తన ఆసక్తిని పవన్ చూపిస్తున్నారు.తెలంగాణా పార్టీ నేతలతో భేటీ అవుతూ తెలంవగాణా రాజకీయ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో కలిసి తెలంగాణాలో పోటీ చేసే వ్యూహంగా పవన్ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పవన్ పార్టీ నేతలు కొన్ని చోట్ల విజయం సాధించకడంతో…పవన్ వారితో కొండగట్టులో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అభినందించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామ ని ప్రకటన చేశారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన స్థానాలు అతి తక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ను తెలంగాణాలో కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావ్ లు ఆహ్వానిస్తే…పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు రోజులు ప్రచారానికి షెడ్యూల్ విడుదల చేస్తామని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అప్పటికే పవన్ పై విమర్శలు మొదలు పెట్టడంతో బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ప్రచారం వద్దంటూ మళ్లీ సమాచారం ఇచ్చారు.
ప్రచారం చేసిన ఫలితం దక్కేది కాదు…

దీంతో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన ఓ వీడియో విడుదల చేసి తమ ప్రచారాన్ని పూర్తి చేసుకుంది. ఈ పరిస్థితుల్లో పవన్ ప్రచారానికి రాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఒక ఇగోయిస్ట్ నేత అని చెప్పుకుంటూనే పవన్ కు చంద్రబాబు ప్రొడ్యూసర్ గా ఉన్నారని, లోకేస్ కో ప్రోడ్యూసర్ అని వ్యాఖ్యలు చేశారు. తాజాగా మోడీ పవన్ కు కొత్త ప్రొడ్యూసర్ లా వ్యవహరిస్తున్నారన్నారు. పవన్ తెలంగాణా గురించి నోరు జారి మాట్లాడరని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన స్పందించలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసినా….ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కేది కాదన్నారు.






Leave a Reply