NewsInn

News in a Click

బంగ్లాదేశ్ బూచీ…..దిగివ‌చ్చిన పాకిస్తాన్

బంగ్లాదేశ్ బూచీ…..దిగివ‌చ్చిన పాకిస్తాన్

కొలంబో మ్యాచ్ భారత్ తో ఆడేందుకు రెడీ

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌)

చివ‌రకు ప్ర‌ఖ్యాత మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ చెప్పిందే పాకిస్తాన్ జ‌ట్టు విష‌యంలో నిజ‌మైంది. ఇండియాతో మ్యాచ్ విష‌యంలో పాక్ నిర్ణ‌యాన్ని గ‌వాస్క‌ర్ లైట్ తీసుకున్నారు. భార‌త్ తో మ్యాచ్ బ‌హిష్క‌రించిన‌ట్లు ప్ర‌క‌టించిన ఆ దేశం నిర్ణ‌యం మారేందుకు 13వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం ఉంటుంద‌న్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లు, బోర్డు స్థిర‌మైన నిర్ణ‌యాన్ని అమ‌లు చేసిన సంద‌ర్బాలు లేవ‌ని ఆయ‌న త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.పాకిస్తాన్ ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం ఇదే విష‌యాన్ని రుజువు చేసింది. కొలంబోలో జ‌రిగే భార‌త్ మ్యాచ్ ఆడుతామ‌ని పాక్ ప్ర‌క‌టించింది.

టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ లో అంద‌రి దృష్టి దాయాదారుల పోరుపైనే మొద‌టి నుంచి ఉంది. కానీ పాకిస్తాన్ భార‌త్ తో త‌ల‌ప‌డేందుకు బంగ్లా క్రికెట్ ను బూచీగా చూపి భార‌త్ మ్యాచ్ బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పాకిస్తాన్ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మాజీ అగ్ర‌శ్రేణి క్రికెట‌ర్లు కూడా పాక్ తీరును త‌ప్పుబ‌ట్టారు. పాక్ మాజీలు కూడా పాక్ తీసుకున్న నిర్ణ‌యం పై పెద‌వి విరిచారు.

ఈ ప‌రిస్థితుల్లో ఐసీసీ కూడా పాకిస్తాన్ జ‌ట్టు బ‌హిష్క‌రిస్తే న‌ష్ట‌పోయే వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ పాక్ ను దారికి తెచ్చుకునేందుకు అన్ని అస్త్రాలు వినియోగించింది. ఈ మ్యాచ్ ద్వారా పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లుతుంద‌ని, ఆడ‌కపోతే భ‌విష్య‌త్తులో పాక్ పై క‌ఠిన నిర్ణ‌యాలు అమ‌లు చేయ‌క‌త‌ప్ప‌ద‌న్న హెచ్చ‌రిక‌లు చేసింది. ఐసీసీ అధికారికంగా ఆర్ధిక వ్య‌వ‌హారాల‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయినా…. పాకిస్తాన్ పై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చింది.

ఐసీసీ నిధులు ఆగిపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఆర్ధికంగా నిల‌దొక్కుకోవ‌డం ఇబ్బంది క‌రంగా మారే అవ‌కాశం ఉంటుంది. ఈవిష‌యాన్ని ఆదేశ మాజీ క్రికెట‌ర్ ర‌మీజ్ రాజా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు.ఇది ఇలా ఉంటే బంగ్లా బూచి చూపి భార‌త్ తో మ్యాచ్ ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన పాకిస్తాన్….ఆ త‌రువాత క్ర‌మంగా మెత్త‌బ‌డంది. భార‌త్ తో మ్యాచ్ ఆడాలంటే కొన్ని నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని ఐసీసీ ముందు డిమాండ్లు ఉంచింది. పాక్ డిమాండ్ల‌పై బీసీసీఐ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా స్వ‌తంత్ర వేదిక‌పై జ‌రిగే మ్యాచ్ లో తాము ఐసీసీ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌ని పీసీబీ డిమాండ్లు త‌మ‌కు ఆమోద యోగ్యం కాద‌ని స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఐసీసీ త‌ర‌చూ సంప్ర‌దింపులు జ‌రుపుతుండ‌డం….ఆ దేశం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారి తీయ‌డంతో పాక్ ఎట్ట‌కేల‌కు కొలొంబో లో ఈ నెల 15వ తేదీన జ‌రిగే మ్యాచ్ లో అడేందుకు ఒకే చెప్పింది. దాదాపు రెండు వారాలుగా జ‌రుగుతున్న ఉత్కంఠ‌కు తెర‌దించింది. అయితే ఈ గేమ్ లో బంగ్లాదేశ్ మాత్రం బ‌లైంది. పాకిస్తాన్ జ‌ట్టును చూసి బంగ్లా భార‌త్ తో త‌ట‌స్థ వేదిక‌ల‌పై త‌మ మ్యాచ్ లు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేయ‌డం, అందుకు ఐసీసీ అంగీక‌రించ‌క‌పోవ‌డం బంగ్లాకు మ‌ద్ద‌తుగా పాకిస్తాన్ పావులు క‌దిపి చివ‌రకు ఐసీసీ వ‌త్తిళ్ల‌కు త‌ల‌గ్గి భార‌త్ మ్యాచ్ అడేందుకు రెడీ అని ప్ర‌క‌టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *