
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
నేషనల్ రైల్ మ్యూజియంలో ఉన్న, దక్షిణ మధ్య రైల్వేలోని లాలాగూడ వర్క్షాప్ సిబ్బంది నిర్వహణలో ఉన్న పురాతన జాన్ మోరిస్ ఫైర్ ఇంజిన్, 2026 ఫిబ్రవరి 8వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన 59వ స్టేట్స్మన్ వింటేజ్ & క్లాసిక్ కార్ ర్యాలీలో రెండు ట్రోఫీలను గెలుచుకుంది. ఈ ర్యాలీ స్టేట్స్మన్ భవనం నుండి గ్రేటర్ నోయిడా వరకు వెళ్లి, తిరిగి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వరకు 90 కిలోమీటర్ల దూరం వరకు సాగింది.
1914వ సంవత్సరంలో తయారు చేయబడిన జాన్ మోరిస్ ఫైర్ ఇంజన్, ఒక విశిష్టమైన 111 సంవత్సరాల పురాతన వారసత్వ వాహనం. దీనిని వాస్తవానికి హైదరాబాద్ నగరంలో హెచ్.ఇ.హెచ్ నిజాం స్టేట్ రైల్వే ఉపయోగించేది. ఈ ఇంజిన్ ఇప్పుడు న్యూఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచారు. ఈ సంవత్సరం, జాన్ మోరిస్ ఫైర్ ఇంజిన్ను ‘ఇండియన్ ఆయిల్ హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రోఫీ’తో సత్కరించబడింది. ఇది వింటేజ్ ర్యాలీ యొక్క సారాంశాన్ని, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురాతన వాహనానికి ప్రదానం చేయబడింది. వారసత్వ సంపదను సంరక్షించడం మరియు నిర్వహణలో అత్యుత్తమంగా నిలిపినందుకు బ్రిటిష్ తయారీ మోటార్ కార్లను గుర్తించి ‘ఆటోమోటివ్ ట్రస్ట్ బ్రిటిష్ హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రోఫీ’ని కూడా అందుకుంది.

జాన్ మోరిస్ ఫైర్ ఇంజిన్ వెనుక కథ ఆసక్తికరంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అసలైన ష్రూస్బరీ, ఛాలెంజర్ సాలిడ్ టైర్లతో అమర్చబడిన ఏకైక వాహనం. అగ్నిమాపక పరికరాల యొక్క అన్ని ఒరిజినల్ భాగాలతో ఇప్పటికీ ఉంది. అగ్నిమాపక పరికరాలలో భాగంగా అజాక్స్ గన్-మెటల్ టర్బైన్ పంపును ఇది కలిగి ఉంది. ఈ ఫైర్ ఇంజన్ ప్రపంచంలోని అత్యుత్తమ రైల్వే మ్యూజియంలలో ఒకటైన న్యూఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియం ప్రాంగణంలో ఉంది. అయితే, దీనికి సంబంధించిన సాధారణ నిర్వహణ పనులను చేపట్టడంలో సికింద్రాబాద్ రైల్వేలోని లాలాగూడ క్యారేజ్ వర్క్షాప్కు చెందిన సాంకేతిక సిబ్బంది బృందం నిపుణులుగా ఉన్నారు.
రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ఫిబ్రవరి 07, 2026న జాన్ మోరిస్ ఫైర్ ఇంజిన్ను తనిఖీ చేశారు. ఆయన అసాధారణ నిర్వహణ ప్రమాణాలను పాటించినందుకుగాను దక్షిణ మధ్య రైల్వే లాలాగూడ వర్క్షాప్ సిబ్బందిని, అభినందించి జాన్ మోరిస్ ఫైర్ ఇంజిన్ కు బహుమతిని ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ కూడా లాలా గూడలోని క్యారేజ్ వర్క్షాప్ బృందాన్ని అభినందించారు.







Leave a Reply