-అనుమానాస్పదం
(హైదరాబాద్,న్యూస్ఇన్)

నగరంలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదంచోటుచేసుకుంది. ఓ కార్ల వర్క్ షాప్ లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పలుకార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. మారుతీ సుజుకీ సర్వీస్ సెంటర్ లో అర్ధరాత్రి తరువాతచోటు చేసుకున్న ఈ ప్రమాదంతో సమీపంలోని అపార్ట్ మెంట్ వాసులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే కావాలని ఎవరో నిప్పంటిచారని వర్క్ షాప్ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Leave a Reply