– కోడంగల్ కు సీఎం రేవంత్ -నేడే మున్సిపోల్స్
- – ఎవరికి వారే ధీమా
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి పుట్టించిన మున్సిపల్ ఎన్నికలకు బుధవారం పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కోసం అధికారులు అన్ని చోట్ల ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరుగుతున్న నాలుగు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అక్కడ ఏ పార్టీ అభ్యర్థులు చైర్మన్ స్థానం చేజిక్కించుకుంటారన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది.

సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలో 3 మున్సిపాల్టీలు ఉన్నాయి. కోడంగల్, కోస్గి, మద్దూరు ఈ మూడు మున్సిపాల్టీల్లో వార్డు అభ్యర్థులను ఏకగ్రీవంగా చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పావులు కదిపినా… అది సాధ్యం కాకుండా ముందస్తు వ్యూహంతో గులాబీ పార్టీ అడ్డు కట్ట వేయగలిగింది. కానీ పోలింగ్ జరిగే నాటికి క్షేత్ర స్థాయి పరిస్థితులు పూర్తిగా తమకు అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ ఎస్ అభ్యర్థులు కూడా ఈ మూడు మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పోటీ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించినా మున్సిపల్ ఎన్నికల సందర్బంగా కోడంగల్ నేతలతో అంతర్గత సమావేశాలతోనే సరిపెట్టి విజయం కోసం వ్యూహాలను అమలు చేస్తూ వచ్చారు. కోడంగల్ పొరుగు నియోజకవర్గం అయిన పరిగిలో జరిగిన సభలో సీఎం పాల్గొన్నారు.

ఇక మాజీ సీఎం కేసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించింది. గజ్వేల్ ప్రచానికి మాజీ మంత్రి హరీష్ రావ్ ఆయను అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక్కడ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి బాధ్యతలు నిర్వహించి సమన్వయం చేస్తూ వచ్చారు.

కేటిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాల్టీలో ఎవరు పాగా వేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రాచారన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మొదలు పెట్టారు. మున్సిపాల్టీలో కారును గెలిపించి తన పట్టును నిరూపించుకోవాలన్న లక్ష్యంగా పావులు కదిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన నేత ఉండడంతో మున్సిపల్ లో పాగా వేయాలన్న లక్ష్యంగా కాంగ్రెస్ నియోజకవర్గంలో పావులు కదిపింది. సీనియర్ నేత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ ఎన్నికలు ఎదుర్కొంటున్నారు.

ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని మరో మున్సిపాల్టీ సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావ్ ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో…ఈ మున్సిపాల్టీ ఎన్నికలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిద్దిపేటతో పాటు నియోజకవర్గంలో కూడా పట్టున్న హరీష్ రావ్ సిద్దిపేటలో బీఆర్ ఎస్ విజయానికి పావులు కదుపుతూ…. ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఒక్క రోజు రికార్డు స్థాయిలో 15 కార్నర్ మీటింగ్ లు ఏర్పాటు చేసి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలను సమన్వయం చేస్తూ ఎన్నికలకు సిద్ధం చేశారు.
కోడంగల్, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఏ పార్టీ పాగా వేస్తుందన్నది రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకునేందకు కోడంగల్ వెళ్లనున్నారు.
అక్కడ ప్రచారానికి దూరం….
కోడంగల్, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఏ పార్టీ పాగా వేస్తుందన్నది రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం చేసిన కీలక నేతలు ఒకరి నియోజకవర్గంలో మరొకరు ప్రచారం చేయకపోవడం విశేషం. మెదక్ జిల్లాలో సీఎం ప్రచారానికే వెళ్లేకపోయారు. సిరిసిల్ల లో ప్రచార సభ నిర్వహించలేదు. బీఆర్ ఎస్ కూడీ సీఎం రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలో ఇంచార్జ్ పట్నం నరేందర్ రెడ్డిని ముందుండి ఎన్నికలు పూర్తి చేసింది.
ఏర్పాట్లు పూర్తి….. వెబ్ క్యాస్టింగ్…
రాష్ట్రంలో గత రెండు వారాలుగా మున్సిపల్ ఎన్నికలు రాజకీయ వేడి పుట్టించాయి. ప్రధాన పార్టీలు ప్రచారంతో ఊదరగొట్టాయి. 116 మున్సిపాల్టీలు, 7 కార్పోరేషన్లకు పోలింగ్ జరుగనుంది. 2582 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఒక వార్డు ఎన్నిక సభ్యుడి మృతి తో ఎన్నికల సంఘం వాయిదా వేసింది. 2569 వార్డులకు రేపు పోలింగ్ జరుగనుంది. 10719 మంది ఎన్నికల్లో వార్డు సభ్యుల కోసం పోటీ పడుతున్నారు. వ్యాప్తంగా 6017 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 7 కార్పోరేషన్లలో రెండు వార్డులు ఏకగ్రీవంగా 412 వార్డులకు 2225 మంవది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కార్పోరేషన్లలో 2174 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2549750 మంది పురుష ఓటర్లు, 2667025 మంది మహిళా ఓటర్ల తో పాటు 638 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించేందుకు అధికారులు వెబ్ క్యాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాలను అనుసంధానం చేశారు.




Leave a Reply