NewsInn

News in a Click

పేదరికం తెలుసు…సంక్షేమం నా బాధ్యత

పేదరికం తెలుసు…సంక్షేమం నా బాధ్యత

గ్లోబల్ సమ్మిట్ ముగింపు

సీఎం రేవంత్ రెడ్డి

(హైదరాబాద్,న్యూస్ ఇన్)

పేదల బాధలు, అంటరానితనం తాను చిన్ననాటి చూసానని తెలంగాణలో సంక్షేమం ఆపకుండా పేదరికాన్ని అధిగమించడమే లక్ష్యంగా సర్కార్ ముందుకు వెళుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండు రోజులపాటు ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మట్ లో ముఖ్యమంత్రి ముగింపు ఉపన్యాసం చేశారు.
తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉంది.జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇదన్నారు.భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది నేలకొరిగిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎదురుచూస్తోందనీ సీఎం చెప్పారు.తెలంగా ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను తీసుకొచ్చామన్నారు.2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు చెప్పారు.


ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసింది కాదు.. నాలుగు కోట్ల ప్రజల అభిప్రాయాలు తీసుకుని తయారు చేసింది.ఆనాడు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు జవహర్ లాల్ నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చానన్నారు.ఇప్పుడు మేం ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే మా ఆకాంక్ష …కొందరికి పేదరికం ఎక్స్కర్షన్ లాంటిది.. కానీ నాకు పేదరికం ఏంటో తెలుసునని వ్యాఖ్యానించారు.
నేను గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోచదువుకుని వచ్చా.. నాకు పేదలు, దళితులు, ఆదివాసీలతో మంచి అనుబంధం ఉందన్నారు.

పేదల కష్టాలు తెలిసినవాడిగా ప్రతీ పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే నా తపన అన్నారు.విద్యార్థి దశలోనే కులవివక్షను నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ లకు ఒకే చోట విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు.సంక్షేమం మేం ఖర్చుగా భావించడంలేదు.. ఇది తెలంగాణ భవిష్యత్ కు పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు.
నాణ్యమైన విద్య, స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతోందన్నారు.
యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని,
ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం చెప్పారు.
అట్టడుగు వర్గాల, పేదల అభివృద్ధి కోసమే ఈ తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ అని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *