NewsInn

News in a Click

క‌ర్నాట‌క‌లో మ‌రోసారి తెర‌పైకి సీఎం మార్పు

క‌ర్నాట‌క‌లో మ‌రోసారి తెర‌పైకి సీఎం మార్పు

ఢిల్లీలోనే మ‌కాం వేసిన డీ.కే శివ‌కుమార్

(బెంగుళూరు,న్యూస్ఇన్‌)

దాదాపు 3 నెల‌ల అనంత‌రం క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో మ‌రోసారి ముఖ్య‌మంత్రి మార్పు చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి రేస్ లో ఉన్న డీకే శివ‌కుమార్ ఢిల్లీలోనే మ‌కాం వేశారు. అస్సాం ఎన్నిక‌ల కోసం ఏఐసీసీ నిర్వ‌హించిన స‌మావేశానికి హాజ‌రైనా ఆయ‌న ఢిల్లీలో మ‌కాం వేసి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈ ఏడాది క‌ర్నాట‌క‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు కూడా నిర్వ‌హించేందుకు స‌ర్కార్ సిద్ధం అవుతుంది. ఈ ప‌రిస్థితుల్లో ముందుగా త‌న ప‌రిస్థితి ఏమిట‌ని కాంగ్రెస్ పెద్ద‌ల ముందు డీకే త‌న డిమాండ్ ను స్ప‌ష్టంగా వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్నాట‌క శాస‌న‌స‌భ్యుల్లో 136 మంది శాస‌న‌స‌భ్యుల బ‌లం త‌న‌కు ఉంద‌ని డీ.కే. హై క‌మాండ్ ముందు ప్ర‌తిపాద‌న‌లు ఉంచిన‌ట్లు తెలుస్తోంది.

మూడు నెల‌ల క్రితం ఈ అంశం తెర‌పైకి వ‌చ్చిన స‌మ‌యంలో జాతీయ స్థాయి అంశాలు కూడా కాంగ్రెస్ దృష్టి సారించింది. రాహూల్ గాంధీ జాతీయ అంశాల‌కే అత్యంద ప్రాధాన్య‌త‌నిస్తున్నార‌ని డీ.కే. కు న‌చ్చ‌చెప్పి అప్ప‌ట్లో ఒప్పించారు.

కానీ ప్ర‌స్తుతం డీ.కే. ఖ‌చ్చితంగా ఏదో ఒక‌టి తేల్చాల‌ని హై క‌మాండ్ ముందు త‌న ప్ర‌తిపాద‌న‌లు ఉంచిన‌ట్లు తెలుస్తోంది. హై క‌మాండ్ కూడా క‌ర్నాట‌క‌లో సీఎం సిద్ద‌రామ‌య్య స్థానంలో డీకే ను నియ‌మించేంద‌కు అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై దృష్టి పెట్టింద‌ని తెలుస్తోంది. 2028 లో క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఈ స‌మ‌యంలో సీఎం మార్పు సాధ్యం కాక‌పోతే ఆ త‌రువాత మార్చినా లాభం లేద‌న్న అభిప్రాయం డీ.కే.త‌న స‌న్నిహితుల‌తో వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నిక‌ల త‌రువాత మ‌రో ఏడాది లోపు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సిద్ధం అయ్యేందుకు పార్టీ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ స‌మ‌యంలో నాయ‌క‌త్వ పై మార్పు జ‌రిగినా పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌ద‌న్న వాద‌న‌ను డీ.కే. తెస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ముఖ్య‌మంత్రిగా సిద్ద‌రామ‌య్య‌ను నియ‌మిస్తున్న స‌మ‌యంలోనే ఇద్దరు నేత‌ల మ‌ధ్య అవ‌గాహ‌ను కాంగ్రెస్ హై క‌మాండ్ కుదిరించింద‌ని, అయితే సిద్ద‌రామ‌య్య సీఎం ప‌ద‌విని వ‌దులు కునేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో క‌న్న‌డ రాజ‌కీయాల్లో సీఎం మార్పు విష‌యం రాజ‌కీయంగా హీట్ పుట్టిస్తోంది.


రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై బీజేపీ కూడా నిషితంగా ప‌రిశీలిస్తోంది. నాయ‌క‌త్వ స‌మ‌స్య కార‌ణంగా జ‌రుగుతున్న ప్ర‌క్రియ త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తోంది. నాయ‌క‌త్వ మార్పు జ‌రిగినా….జ‌రుగ‌క‌పోయినా త‌మ‌కు ల‌బ్ది జ‌రుగుతుంద‌న్న క‌మ‌ల‌నాథులు అంచ‌నా వేస్తున్న‌ట్లు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *