NewsInn

News in a Click

లంచ‌గొండి పోలీసు అధికారి సుదీర్ఘ విచార‌ణ‌

  • రిమాండ్ కు త‌ర‌లింపు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఓ కేసు విష‌యంలో 50 వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ లంచ‌గొండి పోలీసు అధికారి వ్య‌వ‌హారాన్ని ఏసీబీ సీరియ‌స్ గా తీసుకుంది. మంగ‌ళ‌వారం ఏసీబీకి ఆ ఎస్ ఐ ప‌ట్టుబ‌డితే బుధ‌వారం తెల్ల‌వారు ఝాము వ‌ర‌కు ఏసీబీ విచార‌ణ‌, సోదాలు చేసి అవినీతి కార‌ణాల‌ను ఆ అధికారిని విచారించి తెలుసుకుంది. మాదాపూర్ ఎస్ ఐ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న విన‌య్ గ‌త ఏడాది న‌మోదైన ఓ చీటింగ్ కేసులో నిందితుడిని త‌ప్పించేందుకు 50 వేల రుపాయాలు డిమాండ్ చేశారు. ఈ స‌మ‌యంలో ఏసీబీ అధికారులు విన‌య్ ను రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. అప్ప‌టి నుంచి దాదాపు 16 గంట‌ల పాటు ఏసీబీ అధికారులు విచారించి వివ‌రాలు రాబ‌ట్టారు. అదే పోలీస్ స్టేష‌న్లో విచారించిన అధికారులు ఉద‌యం మెడిక‌ల్ టెస్ట్ ల కోసం ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్ కు త‌ర‌లించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *