NewsInn

News in a Click

ట్రెడింగ్ లాభాల‌ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు

ట్రెడింగ్ లాభాల‌ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

సులువుగా త‌మ క‌ష్టార్జితాన్ని రెట్టింపు చేసుకోవ‌చ్చ‌న్న ఆలోచ‌న‌తో మోస‌పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. స్టాక్ మార్కెట్, స్టాక్ ట్రెడింగ్, ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాక్స్ పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు మోసాలు రోజు రోజుకు పెరుగూత‌నే ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో దాదాపు 5.25 కోట్ల రుపాయ‌లు సైబ‌ర్ నేర‌గాళ్ల మోసాల‌తో ప‌డి ప‌లువురు న‌ష్ట‌పోయిన కేసులు న‌గ‌రంలోని వివిధ పోలీస్ స్టేష‌న్ల‌లో న‌మోద‌య్యాయి. సామాన్య ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు మోసగాళ్లు వెబ్ సైట్ లింగ్ లు సోష‌ల్ మీడియాలో ముందుగా షేర్ చేస్తున్నారు. భారీ లాభాలు అంటూ ఆక‌ర్ష‌ణీయంగా వీటిని షేర్ చేస్తున్నారు.

ఈ లింక్ ల‌ను త‌మ అనుచ‌రుల ద్వారా టెలిగ్రామ్, వాట్సప్ ల ద్వారా ట్రేడింగ్ శిక్ష‌ణ‌, భారీ లాభాలు అంటూ మ‌రింత ప్ర‌చారం చేసుకుంటున్నారు. దీంతో సులువుగా లాభాలు గ‌డించాల‌ని వారిని సంప్ర‌దించిన కొండాపూర్ చెందిన ఓ ప్రేవేటు ఉద్యోగి 2.93 కోట్ల రుపాయాలు న‌ష్ట పోయారు. ఆన్ లైన్ వెబ్ లింక్ ద్వారా గ్రూపులో చేరాడు. ఆ గ్రూపులో భారీ లాభాలు అంటూ స్క్రీన్ షాట్ పంపించారు. వీటిని న‌మ్మిన ఆ ఉద్యోగి జ‌న‌వ‌రి 13 వ తేదీ నుంచి 31 వ‌ర‌కు 2.93 కోట్ల రుపాయ‌ల‌ను ఆన్ కేటుగాళ్లు చెప్పిన విధంగా వివిధ అకౌంట్ల‌కు బ‌దిలీ చేశారు. త‌న లాభాలు త‌న‌కు ఇవ్వాల‌ని డ‌బ్బులు విత్ డ్రా చేసుకునేందుకు సైబ‌ర్ నేర‌గాళ్ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపితే మ‌రిన్ని డ‌బ్బులు చెల్లిస్తేనే సాధ్యం అని లేకుంటే సాధ్యం కాదని వారి నుంచి స‌మాధానం రావ‌డంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించి పోలీసుల‌ను ఆశ్రయించారు.

మ‌రోకేసులో దుండిగ‌ల్ లో ప్రైవేటు ఉద్యోగి హ‌నీ ట్రాప్ కు గుర‌య్యారు. ఫేస్ బుక్ ద్వార ఓ మ‌హిళ ప‌రిచ‌యం అయి వాట్సప్ ద్వారా చాటింగ్ చేసింది.న ఆన్ లైన్ ట్రెడింగ్ పేరుతో వెబ్ లింక్ పంపించి రిజిస్ట్రేష‌న్ చేసి ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో 1.14 కోట్లు ఆ కిలాడీ లేడీ వ‌సూలు చేసింది. మూడు నెల‌ల కాలంలో ఈ త‌తంగం పూర్తి చేసింది. ఆ త‌రువాత సంప్ర‌దించేందుకు ప్ర‌య‌త్నించ‌డం స‌ఫ‌లం కాక‌పోవ‌డంతో మోస‌పోయాన‌ని బాధితుడు గ్ర‌హించి పోలీసుల‌ను ఆశ్రయించారు. కొండాపూర్ లో మ‌రో విశ్రాంత ఉద్య‌గి 1.18 కోట్లు పోగుట్టుకున్నారు. వెబ్ లింక్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసి తొలిసారి పెట్టుబ‌డి పెట్ట‌డంతో భారీగా లాభం చూయించారు. ఇది న‌మ్మిన ఆ విశ్రాంత ఉద్యోగి 1.18 ల‌క్ష‌లు పెట్టారు. జ‌న‌వ‌రి చివ‌రి వ‌ర‌కు విశ్రాంత ఉద్యోగితో సైబ‌ర్ నేర‌గాళ్లు ఈ నిధులు కొల్ల‌గొట్టారు. ఆ త‌రువాత స్పందించ‌డం మానారు. దీంతో….ఆ విశ్రాంత ఉద్యోగి మోసపోయిన‌ట్లు గ్ర‌హించి పోలీసుల‌ను ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *