NewsInn

News in a Click

మున్సిపల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కే ఆధిక్యం..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీలు మరియు 7 కార్పొరేషన్ల ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను రాజనీతి స్ట్రాటజీస్ సంస్థ వెల్ల‌డించింది. ఈ సంస్థ అంచ‌నా వేసిన ఫలితాలు ఇలా ఉన్నాయి.

• INC (కాంగ్రెస్): 80 (±5) మున్సిపాలిటీలను దక్కించుకోనుంది…
• BRS: 32 (±5) స్థానాలతో రెండో స్థానంలో నిలవనుంది…
• BJP: 03 (±2) స్థానాలను పొందనుంది…
• AIMIM: 01 స్థానం పొందే అవకాశం ఉంది…

కార్పొరేషన్లలో…..

కరీంనగర్, నిజామాబాద్‌ కార్పోరేషన్లలో హంగ్ ఏర్పడే అవకాశం ఉంది.
ఇక్కడ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే కాంగ్రెస్+ఎంఐఎం కలిసి ఈస్థానాలను దక్కించుకునే అవకాశం కూడా ఉంది.

కాంగ్రెస్‌కు ఎందుకు ఇన్ని సీట్లు…?

• బీజేపి ఓటు పెరగడం వల్ల బీఆర్ఎస్ ఓటు చీలి కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు సాధించనుంది.

• బీజేపి ఓటు పట్టణాల్లో 10 నుంచి 15% దక్కించుకున్న చోట బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు తగ్గి, కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయి.

సామాజిక వర్గాలు ఎటువైపు?
రెడ్డి, దళిత, మైనారిటీ, బీసీలు కాంగ్రెస్ వైపే ఈ ఎన్నికల్లో నిలబడినట్లు ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ వైపు నిలబడ్డ దళిత, మైనారిటీ, బీసీలు కూడా ఈసారి కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో 75 నుంచి 85 స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకోనుంద‌ని రాజ‌నీతి స్ట్రాట‌జీస్ వెల్ల‌డించింది. పీపుల్స్ ప‌ల్స్ సంస్థ కూడా కాంగ్రెస్ కే ఆధిప‌త్యం అని మున్సిపాల్టీల వారిగా స‌ర్వేను వెల్ల‌డించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *