
మంత్రి నారా లోకేష్ సరికొత్త సంప్రదాయం
ప్రజాప్రతినిధులు, కుటుంబాలతో ముచ్చట్లు
(అమరావతి,న్యూస్ఇన్)
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులను కుటుంబసభ్యులతో తన ఇంటికి ఆహ్వానించి, ఆహ్లాదకర వాతావరణంలో విందు ఏర్పాటుచేసి, మాటలు-ముచ్చట్లతో గడిపే సరికొత్త సంప్రదాయానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఉండవల్లి నివాసంలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కుటుంబసభ్యులతో తన ఇంటికి విందుకు ఆహ్వానించారు లోకేష్. ఈ సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. అంతా ఒకేచోట కూర్చుని భోజనం చేశారు. ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులందరినీ పేరుపేరునా పలకరించిన లోకేష్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని ఆత్మీయంగా మాటలు కలిపారు.

ఎటువంటి రాజకీయ చర్చలకు తావులేకుండా పూర్తిగా కుటుంబంలో జరిగే శుభకార్యంలా నిర్వహించారు. తన ఇంటికి వచ్చిన ఆడపడుచులకు లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి చేనేత కళాకారులు నేసిన పట్టుచీరలు బహుకరించారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల అభివృద్ధి, వివిధ సమస్యలపై తనకు ఇచ్చిన వినతులు తాజా స్థితి ఏంటో తెలియజేస్తూ మంత్రి నారా లోకేష్ వారికే నివేదిక రూపంలో అందించారు. ఇందులో తాను పరిష్కరించినవి, పరిష్కార దశలో ఉన్నవి, చేయలేకపోయినవి..కారణాలు పేర్కొంటూ ఇచ్చిన ఈ నివేదికను చూసి ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారు.నారా లోకేష్ ప్రజాప్రతినిధుల కుటుంబాలను ఇంటికి పిలిచి గౌరవించి పంపించే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.




Leave a Reply